బోధన సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీల్లోని దాదాపు 9....
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెల్లడి
కేసీఆర్కు రాజ్యాంగంపై గౌరవం లేదని వ్యాఖ్య
ఈనాడు, హైదరాబాద్- ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్టుడే: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీల్లోని దాదాపు 9 వేల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లో రూ.62.80 కోట్లతో నిర్మించిన డిజిటల్ లెర్నింగ్, శిక్షణ వనరుల సెంటర్, భౌతికశాస్త్రం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ వేదికగా భారత్ బయోటెక్లో కొవిడ్ వ్యాక్సిన్ తయారు కావడం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.
గవర్నర్ కులపతిగా ఉండడమే సరైనది
రాష్ట్ర వర్సిటీలకు కులపతుల విషయంలో రాజకీయాలు చేయడం తగదని ధర్మేంద్రప్రధాన్ అన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు రాష్ట్రపతి, రాష్ట్ర వర్సిటీలకు గవర్నర్ కులపతులుగా ఉండటమే సరైన వ్యవస్థ అన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే పలుమార్లు సూచించినట్లు ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ‘‘ఎన్ఈపీతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఈ విషయంలో తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఏం అభ్యంతరం ఉందో చెప్పాలి. ప్రాథమిక స్థాయిలో బోధన.. స్థానిక భాషల్లో ఉండాలని పాలసీ చెబుతోంది. మీరు దీనిని వ్యతిరేకిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.
ప్రభుత్వం భూములు లాక్కొంటోంది: కులపతి
కులపతి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మాట్లాడుతూ అందరికీ హెచ్సీయూ సున్నిత లక్ష్యంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం భూములు లాక్కొంటోందని చెప్పారు. ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.
జగన్ను చూసి తెలుసుకోవాలి..
ప్రధానిని ఏ విధంగా గౌరవించాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుసుకోవాలని ధర్మేంద్రప్రధాన్ అన్నారు. హెచ్సీయూలో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మరిచిపోకూడదు. మోదీని ఈ దేశ ప్రజలు రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఏపీ సీఎం జగన్ ఏ తరహాలో ప్రధానికి ఆహ్వానం పలికారో.. అదే తరహాలో ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానికి గౌరవం ఇవ్వాలి. కానీ, కేసీఆర్కు రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేదు. ఇది చాలా దురదృష్టకరం’’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చుతామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘కేసీఆర్ ఒక ముంగరీలాల్’’ (హిందీ సీరియల్లో ఓ జోకర్) అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్