ఏఎస్‌ఐ రాముడికి ప్రతిభా పురస్కార ప్రదానం

దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న ఉందకోటి రాముడు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. దిల్లీ పోలీస్‌ కమిషనరేట్‌ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ

Published : 05 Jul 2022 05:52 IST

దిల్లీలో మెరిసిన వనపర్తి వాసి

ఈనాడు, దిల్లీ: దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న ఉందకోటి రాముడు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. దిల్లీ పోలీస్‌ కమిషనరేట్‌ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు సోమవారం పురస్కారాలు ప్రదానం చేశారు. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌.. ఉందకోటి రాముడుకు ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రాముడు 1994లో దిల్లీ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. 2018 నుంచి దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో ఏఎస్‌ఐగా సేవలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని