రూ.19 వేల కోట్ల కోత
తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిని 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రూ.34,970 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ) ప్రకారం ఎఫ్ఆర్బీఎం పరిమితి మేరకు బాండ్ల విక్రయం ద్వారా రూ.53,970 కోట్లను రుణంగా
రుణ పరిమితిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.34,970 కోట్లకే ఆమోదం
కార్పొరేషన్ల రుణాలూ పరిగణనలోకి..
రూ.57 వేల కోట్లను మూడేళ్లకు విభజించిన కేంద్రం
రాబడి పెంపుపై రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు
తాజాగా రూ.3 వేల కోట్ల బాండ్ల విక్రయం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిని 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రూ.34,970 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ) ప్రకారం ఎఫ్ఆర్బీఎం పరిమితి మేరకు బాండ్ల విక్రయం ద్వారా రూ.53,970 కోట్లను రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కేంద్ర ఆర్థికశాఖ ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలనూ ఎఫ్ఆర్బీఎం రుణాల పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రం బాండ్ల విక్రయం ద్వారా తీసుకునే రుణాలు ఈ ఏడాది రూ.34,970 కోట్లకు పరిమితం కానున్నాయి. ఇప్పటికే మొదటి త్రైమాసికంలో జూన్ ఆఖరు వరకు రూ.7,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించి రుణం తీసుకోగా.. ఈ నెల నుంచి ప్రతి త్రైమాసికంలో రూ.9,000 కోట్ల చొప్పున రూ.27,000 కోట్ల బాండ్లను విక్రయించనుంది. బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మార్చి 31న రాష్ట్రాలకు లేఖ రాసింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో కాకుండా అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలు భారీగా పెరుగుతుండటం, వాటిని బడ్జెట్ల నుంచి చెల్లిస్తుండటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ వెలుపల తీసుకున్న రుణాలను ఈ ఏడాది రాష్ట్రాలు తీసుకునే ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి నుంచి మినహాయించనున్నట్లు పేర్కొంది. దీనిపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతిపాదించిన విధానం వివక్షాపూరితంగా ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి తీసుకునే కార్పొరేషన్ రుణాలనూ ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే పరిగణించాలని, గడచిన రెండేళ్లలో తీసుకున్న అప్పులను లెక్కలోకి తీసుకోవడం సరికాదని తెలిపింది. ఇందుకు కేంద్రం అంగీకరించలేదు. గత రెండేళ్లలో తెలంగాణ తీసుకున్న కార్పొరేషన్ల రుణాలు సుమారు రూ.57 వేల కోట్లు. వీటిని కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకు విభజించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బాండ్ల విక్రయం ద్వారా సమీకరించుకునే రుణాల్లో రూ.19 వేల కోట్లు తగ్గించింది.
రెండేళ్లలో తీసుకున్న కార్పొరేషన్ల రుణాలు..
రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు గత రెండేళ్లలో మొత్తం రూ.57,000 కోట్ల రుణాలు తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,489 కోట్లు, 2021-22లో రూ.40,511 కోట్లు తీసుకుంది. గత ఏడాది తీసుకున్న రుణాల్లో అత్యధికంగా రూ.30,922 కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం కాగా.. ఇతర సాగునీటి ప్రాజెక్టులకు రూ.2,315 కోట్లు, మిషన్ భగీరథకు రూ.2,832 కోట్లు ఉన్నాయి. ఇవికాకుండా పేదల ఇళ్ల నిర్మాణం, హైదరాబాద్ జలమండలి, పురపాలక ప్రాజెక్టులు, ఆర్టీసీ, రోడ్ల అభివృద్ధికి ఆయా కార్పొరేషన్లు రుణాలు తీసుకున్నాయి.
అదనపు ఆదాయంపై ఆర్థికశాఖ ప్రత్యేక దృష్టి
ఈ ఏడాది తీసుకునే రుణాల పరిమితిని కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించిన నేపథ్యంలో అదనపు నిధుల సమీకరణపై రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. ఆర్థికశాఖతో పాటు రాష్ట్రానికి రాబడులు తెచ్చే శాఖల ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్షించారు. పన్నులతో పాటు పన్నేతర ఆదాయం, భూముల అమ్మకం ద్వారా అదనపు రాబడి అంచనాల మేరకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రూ.3 వేల కోట్ల బాండ్ల విక్రయం
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆర్బీఐ ద్వారా రూ.3,000 కోట్ల బాండ్లను విక్రయించి రుణాన్ని సమీకరించుకుంది. రూ.1,000 కోట్ల చొప్పున 21, 22, 23 ఏళ్ల కాలపరిమితితో కూడిన బాండ్లను విక్రయించింది.
మోటార్లకు మీటర్లు పెడితే మరో రూ.6,100 కోట్లు.. వద్దన్న రాష్ట్రం
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల(మోటార్ల)కు మీటర్లను బిగించేందుకు అంగీకరిస్తే రుణ పరిమితిని జీఎస్డీపీలో మరో 0.5 శాతం పెంచనున్నట్లు కేంద్రం ప్రతిపాదించింది. దీనికి అంగీకరిస్తే సుమారు రూ.6,100 కోట్లు అదనంగా రుణం పొందేందుకు అవకాశం ఉండగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన రాష్ట్రం అదనపు రుణం తీసుకునేందుకు సుముఖంగా లేనట్లు కేంద్రానికి తేల్చిచెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!