కలిసిరాని కాలంలో.. నడిచొచ్చిన బిడ్డలు
చేతిలో కర్ర లేనిదే కాలు కదపలేని స్థితి.. చూపు మందగించి, గొంతు పెగిల్చి మాట్లాడలేని నిస్సహాయత.. పండు ముదుసలి వయసులో నా అన్న వారు దిక్కు లేకపోతే ఆ వృద్ధులు ఏమైపోవాలి? అలాంటి అభాగ్యుల గోస కొందరు మానవతామూర్తులను కదిలించింది. వృద్ధాప్యంలో ఒంటరైన వారిని తమ అమ్మానాన్నల్లా భావించి
దిక్కులేని ఒంటరి వృద్ధుల దత్తతకు ముందుకొస్తున్న ఔత్సాహికులు
ఆప్యాయంగా చూసుకుంటూ ఆదర్శం
ఉమ్మడి వరంగల్లో వెల్లివిరుస్తున్న మానవీయత
ఈనాడు - వరంగల్, న్యూస్టుడే - ధర్మసాగర్; చేతిలో కర్ర లేనిదే కాలు కదపలేని స్థితి.. చూపు మందగించి, గొంతు పెగిల్చి మాట్లాడలేని నిస్సహాయత.. పండు ముదుసలి వయసులో నా అన్న వారు దిక్కు లేకపోతే ఆ వృద్ధులు ఏమైపోవాలి? అలాంటి అభాగ్యుల గోస కొందరు మానవతామూర్తులను కదిలించింది. వృద్ధాప్యంలో ఒంటరైన వారిని తమ అమ్మానాన్నల్లా భావించి పిడికెడు అన్నం పెడుతున్నారు. ఆసరా లేని ఆ పెద్దవాళ్లను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమను పంచుతున్నారు. అనాథలైన వారిని దత్తత తీసుకుని అవసరాలు తీరుస్తున్నారు. వారిని అవ్వ, అక్క, తాత అంటూ వరసలు కలిపి పిలుస్తూ.. కుటుంబసభ్యుల్లా ఆదుకుంటున్నారు. హనుమకొండ జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తరిస్తున్న ఈ మానవీయ సంస్కృతిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 18 గ్రామాల్లో 42 మంది వృద్ధులకు స్థానికులు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న తీరు ఆదర్శంగా నిలుస్తోంది.
బాలవికాస సంస్థ అనుసంధానకర్తగా ఈ బృహత్కార్యానికి బాటలు పడ్డాయి. సంస్థ వ్యవస్థాపకురాలు బాల థెరిసా. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రెడ్డిపాలేనికి చెందిన ఆమె కెనడాకు వెళ్లి ఆ దేశీయుడినే వివాహం చేసుకున్నారు. అక్కడ ‘సోపార్’ అనే పేరుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. తర్వాత వాటిని వరంగల్కు విస్తరించారు. ఇప్పటికి 1500 తాగునీటి కేంద్రాలు, మహిళా చైతన్య కార్యక్రమాలు, సేంద్రియ సేద్యం, పిల్లల దత్తత వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఆమెను అంతా బాలక్క అంటూ పిలుస్తారు.
మేమున్నామంటూ ముందుకొచ్చి..
బాల థెరిసా ఓసారి వరంగల్కు వచ్చినప్పుడు నిస్సహాయులైన వృద్ధులను చూసి స్పందించారు. వారికి ఊతం అందించాలనే ఆలోచన కలిగింది. అలా వృద్ధుల దత్తత కార్యక్రమానికి సుమారు 15 ఏళ్ల కిందటే బీజం పడింది. బాలవికాసకు మహిళా సభ్యులున్న అన్ని గ్రామాల్లో వృద్ధులకు సాయం అందించడం ప్రారంభించారు. కెనడాలో ఉండే ఓ దాత వీరికి కావాల్సిన సామగ్రి సమకూర్చేవారు. కొన్నేళ్ల తర్వాత ఆ దాత కన్నుమూయడంతో ఈ పథకం సందిగ్ధంలో ఏర్పడింది. బాలవికాస కింద అనేక మహిళా సంఘాలు గ్రామాల్లో ఉన్నాయి. వారితో నిర్వాహకులు ఈ విషయం చెప్పగా.. తమకున్న దాంట్లో వృద్ధులకు కొంత ఇస్తామని ముందుకొచ్చారు. ఏటా రెండు, మూడుసార్లు బాలవికాస హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్పల్లిలో శిబిరం ఏర్పాటు చేస్తుంది. అక్కడికి మహిళలు, ఇతర దాతలు వచ్చి వృద్ధులకు నగదు, బియ్యం సహా 12 రకాల నిత్యావసర సామగ్రి అందజేస్తున్నారు. వీరు ఎంపిక చేసుకున్న ప్రతి గ్రామంలో ముగ్గురు నలుగురు వృద్ధులుంటే అక్కడ వారి అవసరాలు తీర్చేందుకు అంతే సంఖ్యలో దాతలు ముందుకొస్తున్నారు. బాల వికాస మహిళా సమన్వయకర్తలు అనాథ వృద్ధుల్ని గుర్తిస్తూ వారికి సాయం చేసేలా దాతలను అనుసంధానం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛనుకు తోడుగా వీరిచ్చే ఆర్థిక సాయంతో పెద్దవారి అవసరాలు తీరుతున్నాయి.
ఆదాయం కొంచెం.. ఆప్యాయత ఘనం
కూనూరుకు చెందిన పారిజాతకు కూలి పనులే జీవనాధారం. ఆ కొద్దిపాటి సంపాదనలోనూ కొంత మొత్తాన్ని తన ఇంటి వద్ద ఉంటున్న వృద్ధురాలు వెంకటమ్మ కోసం ఆమె వెచ్చిస్తున్నారు. అక్కా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ నిత్యావసరాలు సమకూరుస్తున్నారు.
కన్నకొడుకులా.. కంటికి రెప్పలా..
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరుకు చెందిన దాట్ల నర్సయ్య వయసు 75 సంవత్సరాలు. భార్య కొన్ని దశాబ్దాల కిందట చనిపోయింది. పిల్లలు లేరు. నాలుగడుగులు కూడా వేయలేని నిస్సహాయస్థితిలో ఆయనకు కన్న కొడుకులా అండగా నిలిచారు గ్రామానికి చెందిన ఈగ కృష్ణమూర్తి. నర్సయ్య అవసరాలు తీరుస్తూ తోడ్పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్