నానో యూరియా.. మేలయా!
ద్రవరూపంలో ఉండే నానో యూరియా వినియోగాన్ని భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. సాధారణ గుళికల యూరియాకు బదులు దీనిని వాడటం వల్ల రైతులకు ఎకరానికి రూ.4 వేల దాకా ఆదా అవడమే కాకుండా ఇంకా ఎన్నో సత్ఫలితాలు వస్తాయని
ఎకరానికి రూ.4 వేలు ఆదా!
పర్యావరణానికి ప్రయోజనం
భారీ ఎత్తున ఉత్పత్తి, వినియోగానికి కేంద్రం నిర్ణయం
రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచన
ఈనాడు, హైదరాబాద్: ద్రవరూపంలో ఉండే నానో యూరియా వినియోగాన్ని భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. సాధారణ గుళికల యూరియాకు బదులు దీనిని వాడటం వల్ల రైతులకు ఎకరానికి రూ.4 వేల దాకా ఆదా అవడమే కాకుండా ఇంకా ఎన్నో సత్ఫలితాలు వస్తాయని కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నానోయూరియా ఉత్పత్తిని భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీని వినియోగం గణనీయంగా పెంచేందుకు రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు తాజాగా సూచించింది. గత ఆగస్టు నుంచి దేశంలో నానో యూరియా వాణిజ్య వినియోగం ప్రారంభమైంది.
ఏటా 44 కోట్ల సీసాల ఉత్పత్తి లక్ష్యం
డ్రోన్ల ద్వారా నానో యూరియా చల్లేందుకు ఇప్పటికే 228 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చినట్లు కేంద్ర ఎరువుల శాఖ వెల్లడించింది. డ్రోన్లను నడపటం వల్ల వారికి నెలకు రూ.46 వేల దాకా ఆదాయం వస్తుందని ప్రకటించింది. 2021 ఆగస్టు నుంచి గత నెలాఖరు వరకు 3.90 కోట్ల నానో యూరియా సీసాలను ఇఫ్కో సంస్థ గ్రామాలకు పంపగా రైతులు 2.87 కోట్ల సీసాలను కొని పంటలపై చల్లినట్లు తాజాగా వెల్లడైంది. ఇది 13 లక్షల టన్నుల సాధారణ గుళికల యూరియాతో సమానమని తేలింది. రైతులకే కాకుండా కేంద్ర ప్రభుత్వం సాధారణ యూరియాపై ఇస్తున్న రాయితీ నిధులు ఏటా రూ.40 వేల కోట్ల వరకూ ఆదా అవుతాయని తేల్చారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 8 ప్లాంట్లలో ఏటా 44 కోట్ల నానో యూరియా సీసాలు ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యాన్ని ప్రకటించింది. నానో యూరియాపై పేటెంట్ కలిగిన ఇఫ్కో కంపెనీతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్’ కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నాయి. ఆ కంపెనీలకు చెందిన ఫెర్టిలైజర్స్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తగ్గనున్న కాలుష్యం...
పంట పొలాల్లో అధికంగా చల్లుతున్న సాధారణ యూరియా వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. నేలసారం దెబ్బతింటోంది. దీన్ని అధిగమించడానికి నానో యూరియా ఉపయోగపడుతుందని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్)కు చెందిన పరిశోధన సంస్థలు వెల్లడించాయి. నానో యూరియా వాడితే పంటల ఆహారోత్పత్తుల్లో పోషక విలువలు కూడా పెరుగుతాయి. సాధారణ యూరియా బస్తాల రవాణాకు ఏటా రైళ్లు, లారీలకు రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నారు. సీసాల రవాణాతో ఆ వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. దేశవ్యాప్తంగా 94 రకాల పంటలపై 11 వేల మంది రైతుల పొలాల్లో 43 ప్రాంతాల్లో ఐసీఏఆర్ నిర్వహించిన ప్రయోగాల్లో నానో యూరియా వాడకం వల్ల 8 శాతం వరకూ పంట ఉత్పాదకత పెరిగినట్లు తేలింది. నానో యూరియాను అరలీటరు చొప్పున సీసాలో రైతులకు విక్రయిస్తున్నారు. ఇది సాధారణ గుళికల యూరియా 45 కిలోలకు సమానమైన పోషకశక్తిని కలిగి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..