ప్రతిష్ఠాత్మకంగా కాకతీయ వైభవ సప్తాహం
తెలంగాణ పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానమైనదని, కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టత భావితరాలకు తెలిపేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాకతీయ వైభవంపై ప్రత్యేక
మంత్రి కేటీఆర్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానమైనదని, కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టత భావితరాలకు తెలిపేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాకతీయ వైభవంపై ప్రత్యేక తపాలా స్టాంపు విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరంగల్ వేదికగా ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహం బ్రోచర్ను సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్తో కలిసి కేటీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో విడుదల చేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ‘కాకతీయ వేడుకల్లో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తున్నాం. కాకతీయ గొలుసుకట్టు చెరువుల నిర్మాణంపై నిపుణులతో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తాం. కళాకారులను, కవులను సన్మానిస్తాం’ అని తెలిపారు.
‘కేసీఆర్- రాజకీయ కళ’ పుస్తకావిష్కరణ
అనితర సాధ్యుడు, తెలంగాణ సాధకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ను కొంతమంది అహంకారంతో ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్కు చెందిన రచయిత చిమ్మని మనోహర్ రాసిన ‘కేసీఆర్- రాజకీయ కళ (ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్) పుస్తకాన్ని మంగళవారం ప్రగతిభవన్లో ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘గత అరవైయ్యేళ్లుగా కలగా మిగిలిన తెలంగాణను కేసీఆర్ సాధించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపారు. ఇంత చేస్తుంటే కొంతమంది అభివృద్ధి నిరోధకులు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో రచయిత మనోహర్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా సంచాలకుడు దిలీప్ కొణతం పాల్గొన్నారు.
ముఖ్రా-కె గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
తెలంగాణ అభివృద్ధికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా-కె గ్రామం ముఖచిత్రం వంటిదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ప్రతి ఇంటికి సంక్షేమం - ప్రతి ఇంటికి కేసీఆర్’ పేరుతో ముఖ్రా గ్రామంలో చేపట్టిన ప్రచారం అభినందనీయమని, మిగిలిన గ్రామాలు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామ సర్పంచి గాడ్గే మీనాక్షి మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలవగా, ఆయన అభినందించి సత్కరించారు. ‘గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ. 34 కోట్ల నిధులను మంజూరు చేసిన వివరాలతో గ్రామంలో ఫ్లెక్సీ పెట్టడం అభినందనీయం. పల్లెప్రగతి ద్వారా జాతీయస్థాయిలో ఆదర్శగ్రామంగా ముఖ్రా నిలిచింది. ఈ గ్రామాభివృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తాం’ అని కేటీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!