పాటకు పట్టం.. కథకు వందనం
దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజ్యసభ అవకాశం కల్పించింది. దశాబ్దాలుగా తన సుస్వరాలతో అభిమానులను అలరిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా (తమిళనాడు)తో పాటు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు కథలు అందించడం ద్వారా భారతీయ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంలో
రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్
పి.టి.ఉష, వీరేంద్ర హెగ్గడేలకూ అవకాశం
రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్రం
నలుగురూ దక్షిణాది వారే
ఈనాడు, దిల్లీ: దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజ్యసభ అవకాశం కల్పించింది. దశాబ్దాలుగా తన సుస్వరాలతో అభిమానులను అలరిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా (తమిళనాడు)తో పాటు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు కథలు అందించడం ద్వారా భారతీయ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంలో కీలక పాత్ర పోషించిన కథారచయిత/దర్శకుడు వి.విజయేంద్రప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)లను రాష్ట్రపతి కోటాలో పెద్దల సభకు నామినేట్ చేసింది. పరుగుల రాణిగా పేరొందిన పి.టి.ఉష (కేరళ), ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వీరేంద్ర హెగ్గడే (కర్ణాటక)లకూ అదే కోటాలో ఎగువ సభకు అవకాశం కల్పించింది. ఈ నలుగురూ దక్షిణాది వారే కావడంతో.. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో దక్షిణ భారతీయులను అధికార పక్షం విస్మరించిందంటూ వస్తున్న విమర్శలకు కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశముంది. ఈ నలుగురు తమ రంగాలకు దశాబ్దాలుగా విశేష సేవ చేస్తున్నారని కేంద్రం తెలిపింది. అందుకు గుర్తింపుగానే వారిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు పేర్కొంది.
కథావిజయేంద్రుడు
విజయేంద్రప్రసాద్ ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో 1947 మే 27న జన్మించారు. విజయవాడ లయోలా కాలేజీలో చదువుకున్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈయన కుమారుడే. భజరంగీ భాయిజాన్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ తదితర సూపర్హిట్ చిత్రాలకు విజయేంద్రప్రసాద్ కథలు అందించారు. తెలుగు జాతి ఖ్యాతిని, భారతీయ చిత్రసీమ సత్తాను వాటితో ప్రపంచానికి చాటారు. భజరంగీ భాయిజాన్ సినిమాకు 2016లో ఈయన ఉత్తమ కథారచయితగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు.
సినీ సంగీత సామ్రాట్
ఇళయరాజా తమిళనాడులోని మదురై జిల్లాలో దళిత కుటుంబంలో జన్మించారు. భారతీయ సినిమా సంగీత సామ్రాట్గా గుర్తింపు పొందారు. అయిదు దశాబ్దాల కెరీర్లో వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. 7 వేలకు పైగా పాటలు సృష్టించారు. 2018లో ఈయన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అయిదు జాతీయ సినిమా అవార్డులు, సంగీత నాటక అకాడమీ అవార్డులూ పొందారు.
పరుగుల రాణి
కేరళలో కోజికోడ్ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన ఉష.. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన పరుగుతో ట్రాక్పై పతకాల పంట పండించారు. ‘పయ్యోలి ఎక్స్ప్రెస్’గా పేరొందారు. కెరీర్లో ఎన్నోసార్లు జాతీయ, కామన్వెల్త్, ఆసియా రికార్డులు బద్దలుకొట్టారు. 1984 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్లో 400మీ హర్డిల్స్లో సెకనులో వందో వంతు తేడాతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఆసియా క్రీడల్లో 4 స్వర్ణాలతో సహా 11 పతకాలు గెలిచారు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ఏకంగా 14 పసిడి పతకాలు అందుకున్నారు.పరుగుకు వీడ్కోలు పలికాక ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను ప్రారంభించి ఛాంపియన్లను తీర్చిదిద్దే బాధ్యత చేపట్టారు. అర్జున, పద్మశ్రీ పురస్కారాలు పొందారు.
ధర్మస్థల ధర్మాధికారి
వీరేంద్ర హెగ్గడే 20వ ఏట నుంచే తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (ఆర్డీసెటీ) ఏర్పాటుతో గ్రామీణ యువతకు చేయూతనందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో 6 లక్షల స్వయం సహాయక సంఘాలు నడుస్తున్నాయి. కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయానికి ధర్మాధికారి ఈయన. ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్కు నేతృత్వం వహిస్తూ.. వేల మంది చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 2015లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.
ప్రధాని అభినందనలు
రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, పి.టి.ఉష, వీరేంద్ర హెగ్గడేలను ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా అభినందించారు. ‘‘వి.విజయేంద్రప్రసాద్ దశాబ్దాల తరబడి సృజనాత్మక ప్రపంచంతో మమేకమై ఉన్నారు. ఆయన వల్ల అద్భుతమైన భారతీయ సంస్కృతి ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘సృజనాత్మక మేధావి ఇళయరాజా తన సంగీత మేధస్సుతో తరతరాలను ఆనంద డోలికల్లో ఊపుతున్నారు. ఆయన పని ఎన్నో భావోద్వేగాలను ప్రతిబింబించింది. ఆయన అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు’’ అని ఇళయరాజాను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, సంస్కృతుల అభ్యున్నతికి వీరేంద్ర హెగ్గడే గొప్ప కృషిచేస్తున్నారని కీర్తించారు. క్రీడారంగంలో పి.టి.ఉష చూపిన ప్రతిభాపాటవాలు జగద్విదితమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!