‘శాఫ్రాన్’తో వైమానిక పరిశ్రమకు ఊతం
మంత్రి కేటీఆర్ హర్షం
రూ. 1200 కోట్లతో ఏర్పాటు
నేడు ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: ఫ్రాన్స్కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ ‘శాఫ్రాన్’ తెలంగాణలో రూ.1,200 కోట్లతో విమాన ఇంజిన్ల నిర్వహణకు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్(ఎంఆర్వో) కేంద్రం ఏర్పాటు చేయడంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం ట్విటర్లో హర్షం వ్యక్తంచేశారు. భారత్లో తమ తొలి ఎంఆర్వో కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకోడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకమని, సంస్థను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం ఇదేనని, మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనన్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజిన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన శాఫ్రాన్ ఏర్పాటు చేయనున్న ఎంఆర్వో కేంద్రంతో సుమారు వెయ్యి ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. ‘‘భారత్తో పాటు విదేశీ వాణిజ్య విమానాల్లో వాడే లీప్-1ఏ, లీప్-1బీ ఇంజిన్ల నిర్వహణను హైదరాబాద్లోనే చేస్తారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. శాఫ్రాన్ ఎంఆర్వో కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని వైమానిక పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుంది. తెలంగాణ ఏరోస్పేస్ వ్యాలీగా మారుతుంది. అగ్రశ్రేణి సంస్థ అయిన శాఫ్రాన్ పెడుతున్న భారీ పెట్టుబడితో ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైంది’’ అని వివరించారు. శాఫ్రాన్ సంస్థ ఫొటోలను మంత్రి కేటీఆర్ తన ట్వీట్కు జతచేశారు.
* శాఫ్రాన్ సంస్థ శంషాబాద్లోని జీఎంఆర్ ఏరోసిటీలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్వో కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.
టీవర్క్స్ భవనం త్వరలో ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ అయిన టీవర్క్స్ సొంత భవనం త్వరలోనే ప్రారంభమవుతుందని, అది రాష్ట్రంలో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందని కేటీఆర్ బుధవారం ట్విటర్లో వెల్లడించారు. టీవర్క్స్ ద్వారా ఆవిష్కరణల రంగంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందని పేర్కొన్నారు.
గుజరాత్లో బుల్డోజర్లు లేవా?
గుజరాత్లోని భవనాల్లో 35 శాతం అక్రమ నిర్మాణాలేనని, అక్కడ బుల్డోజర్లను ఎందుకు ఉపయోగించడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒక నెటిజన్ గుజరాత్లో అక్రమ నిర్మాణాలపై కేటీఆర్కు ట్వీట్ చేయగా ఆయన పైవిధంగా స్పందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Video: భారత్ 75 ఏళ్ల ప్రయాణం.. 2 నిమిషాల వీడియోలో..!
-
India News
India Corona: కాంగ్రెస్లో కరోనా కలకలం.. నిన్న ఖర్గే..నేడు ప్రియాంక
-
Movies News
Alitho Saradaga: ఆమె రాసిన ఉత్తరం కంటతడి పెట్టించింది : యువహీరో నిఖిల్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Road Accident: టైరు పేలి బోల్తాపడిన కారు.. నలుగురి దుర్మరణం
-
Ts-top-news News
Hyderabad: ఆ ట్వీట్తో దిల్లీ నుంచి హైదరాబాద్కు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!