అనధికార రిజర్వాయర్లలోనివి నికర జలాలే!
నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రిజర్వాయర్ల యాజమాన్య కమిటీ(ఆర్ఎంసీ) కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన 2021 జులై తర్వాత చేపట్టిన అనధికార రిజర్వాయర్లలో
తెలంగాణ, ఏపీలపై ప్రభావం చూపనున్న ఆర్ఎంసీ ప్రతిపాదనలు
సమావేశ వివరాలను రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు పంపిన కృష్ణా బోర్డు
ఈనాడు హైదరాబాద్: నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రిజర్వాయర్ల యాజమాన్య కమిటీ(ఆర్ఎంసీ) కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన 2021 జులై తర్వాత చేపట్టిన అనధికార రిజర్వాయర్లలో నిల్వ చేసే నీటిని మిగులు జలాల నుంచి లెక్కించినా.. నికర జలాలుగానే పరిగణిస్తామని పేర్కొంది. అయితే, గెజిట్ నోటిఫికేషన్ రాకముందే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, 2021 జులై తర్వాత పూర్తి చేసిన అనధికార రిజర్వాయర్లలో నిల్వ చేసే నీటినే తాజా ప్రతిపాదన ప్రకారం పరిగణనలోకి తీసుకొంటారా లేక గెజిట్ నోటిఫికేషన్ తర్వాత నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రధాన నదిపై ఉన్న రిజర్వాయర్లు కాకుండా పక్కకు నీటిని మళ్లించి నిల్వ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో వర్షాలు కురిసి నీటిని దిగువకు వదలాల్సి వస్తే.. వాటిని మిగులు జలాల కింద వినియోగించుకోలేకపోయిన వాటిగా జమ కట్టేలా మరో ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనలు రెండు రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపనున్నాయి. జులై ఒకటిన బోర్డు ఆధ్వర్యంలోని రిజర్వాయర్ల యాజమాన్య కమిటీ మూడో సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకొన్న నిర్ణయాలను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లకు బుధవారం పంపింది.
శ్రీశైలం, నాగార్జునసాగర్లలో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు సంబంధించి, రూల్కర్వ్ అమలుపై మొదటి రెండు సమావేశాల్లో తీసుకొన్న నిర్ణయాలను తెలంగాణ పరిశీలించాల్సి ఉన్నందున వచ్చే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. అయితే, మిగులు జలాల వినియోగం, వీటిని ఎలా లెక్కగట్టాలన్నదానిపై తాజా సమావేశంలో వివరంగా చర్చించినట్లు రెండు రాష్ట్రాలకు రాసిన లేఖలో బోర్డు తెలిపింది. వినియోగం రాష్ట్రాల వారీగా లెక్కగట్టడంతోపాటు నికరజలాలు, మిగులు జలాల వినియోగం వేర్వేరుగా పరిగణనలోకి తీసుకొంటారు. మిగులు జలాలు ఉన్న రోజులు మినహా మిగిలిన నీటి వినియోగం మొత్తాన్ని నికర జలాలుగానే పరిగణిస్తారు. వరదల సమయంలో ప్రధాన కృష్ణాలోని రిజర్వాయర్లన్నీ నిండి గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నప్పుడు వినియోగించే నీటిని మిగులు జలాలుగా పేర్కొన్నారు. ప్రధాన కృష్ణాలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలతోపాటు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీని కూడా పరిగణనలోకి తీసుకొని మిగులు ఎన్నిరోజులు ఉందన్నది కృష్ణా బోర్డు ప్రకటిస్తుంది. ఆ సమయంలో జరిగిన వినియోగం అంతా మిగులు జలాల కిందే లెక్క.
ఆ ప్రాజెక్టులకు మరిన్ని సమస్యలు
ప్రస్తుతం కృష్ణా బేసిన్లో 75 శాతం నీటిలభ్యత కింద వినియోగం జరుగుతోంది. బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ అవార్డు తీర్పు అమల్లోకి వస్తే 65 శాతం నీటి లభ్యత కింద వినియోగం అమల్లోకి వస్తుంది. రిజర్వాయర్ల నిల్వలలోనూ మార్పు వస్తుంది. మిగులు జలాలు ఇంకా తగ్గి.. వీటి ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటాయి. దీంతోపాటు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న అనధికార ప్రాజెక్టులను నిలిపివేయాల్సి వస్తుంది. బోర్డు తాజా ప్రతిపాదలపై రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. రిజర్వాయర్ల యాజమాన్య కమిటీ తదుపరి సమావేశాన్ని ఈ నెల 15న జరపాలని బోర్డు నిర్ణయించింది. అయితే, 13 నుంచి 15 వరకు బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ సమావేశాలు జరగనున్నందున రెండు రాష్ట్రాల నీటిపారుదల అధికారులు దిల్లీలో ఉండే వీలుంది. ఈ నేపథ్యంలో యాజమాన్య కమిటీ సమావేశం వాయిదాపడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM