సంధానకర్తగా వ్యవహరిస్తా: మందా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా పని చేస్తానని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర

Published : 07 Jul 2022 03:09 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా పని చేస్తానని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో తరచూ సమావేశమై రాష్ట్రానికి నిధులు వచ్చేలా ప్రయత్నిస్తానన్నారు. వివిధ ప్రాజెక్టులకు అనుమతులు త్వరితగతిన వచ్చేలా చూస్తానని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలను కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఎప్పటికప్పుడు తీసుకెళతానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని