65 కోర్టు మాస్టర్‌ పోస్టులకు హైకోర్టు నోటిఫికేషన్‌

హైకోర్టు న్యాయమూర్తులకు, రిజిస్ట్రార్‌లకు వ్యక్తిగత కార్యదర్శులు, కోర్టు మాస్టర్‌ పోస్టుల నిమిత్తం ఇటీవల హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 65 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు

Published : 07 Jul 2022 05:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తులకు, రిజిస్ట్రార్‌లకు వ్యక్తిగత కార్యదర్శులు, కోర్టు మాస్టర్‌ పోస్టుల నిమిత్తం ఇటీవల హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 65 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ ప్రకటన జారీ చేశారు. ఓసీలకు 29 పోస్టులు కేటాయించగా ఇందులో 8 స్త్రీలకు, 4 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, 3 ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు కేటాయించారు. మిగిలిన పోస్టుల్లో ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, బీసీ వర్గాలకు 17, పాక్షిక దృష్టి, వినికిడి లోపం ఉన్నవారికి రిజర్వేషన్‌లు కేటాయించారు. డిగ్రీతోపాటు షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్‌ల్లో అర్హత సాధించి ఉండాలి. ఎంపిక విధానంతోపాటు దరఖాస్తు నమూనా హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని