Monkeypox: మంకీపాక్స్పై అప్రమత్తత
కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంకీపాక్స్ ఇప్పటికే 50 దేశాల్లో వ్యాప్తి చెందింది. జనవరి 1 నుంచి జూన్ 22 నాటికి 3,413 కేసులు
మార్గదర్శకాలు జారీ
ఈనాడు, హైదరాబాద్: కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంకీపాక్స్ ఇప్పటికే 50 దేశాల్లో వ్యాప్తి చెందింది. జనవరి 1 నుంచి జూన్ 22 నాటికి 3,413 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఒకరు మృతిచెందారు. జంతువుల నుంచి వ్యాప్తి చెందే వైరస్ సంబంధిత వ్యాధి ఇది. ఈ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. మంకీపాక్స్ను సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రోగుల నుంచి నమూనాలను సేకరించాలి? వారిని ఎలా గుర్తించాలి? ముందస్తుగా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలా అడ్డుకోవాలి? తదితర అంశాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో డీహెచ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు పంపించారు.
వ్యాధిని గుర్తించడమెలా?
శరీరంపై దద్దుర్లు రావడం మంకీపాక్స్ ప్రధాన లక్షణం. దీంతో పాటు జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చంకల్లో, గజ్జల్లో లింఫుగ్రంధుల్లో వాపు, నీరసం, చలి, చెమట పట్టడం, గొంతునొప్పి, దగ్గు తదితర లక్షణాలున్న వారి నుంచి నమూనాలను సేకరించాలి. మంకీపాక్స్ అనుమానిత నమూనాలను పరీక్షించడానికి దేశం మొత్తమ్మీద 15 ప్రయోగశాలలకు అనుమతివ్వగా.. రాష్ట్రంలో గాంధీలోని ప్రయోగశాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. విదేశాల నుంచి వచ్చే వారి నుంచే కాకుండా స్థానికంగా ఉన్న వారిలోనూ లక్షణాలు కనిపిస్తే నమూనాలను సేకరించాలని ఆదేశించారు. అయితే అనుమానితుల ప్రయాణ చరిత్రను తెలుసుకోవాలన్నారు.
వ్యాప్తి ఇలా?
మంకీపాక్స్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే అత్యంత సమీపంగా ఉండి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లను పీల్చుకోవడం ద్వారా.. తాకడం, ముద్దు పెట్టుకోవడం, కరచాలనాలు, చెమట, కన్నీళ్లు, తదితర శరీర స్రావాలు, లైంగిక సంపర్కం, బాధితుడు ఉపయోగించిన తువ్వాలు, దుస్తులు తదితర వస్తువులను వాడడం వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిర్ధారణ అయిన వారిని విడి గదిలో ఉంచడంతో పాటు సన్నిహితంగా మెలగకూడదు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. మంకీపాక్స్పై ఏవైనా అనుమానాలుంటే 90302 27324 నంబరుకు వాట్సప్ ద్వారా సమాచారాన్ని పంపించవచ్చు. నేరుగా కాల్ చేయాలనుకుంటే 040 24651119 నంబరుకు ఫోన్ చేయాలని ప్రజారోగ్య సంచాలకుడు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా