వెళ్లలేం.. వదల్లేం..
రాష్ట్రంలోని కొత్త పారిశ్రామిక పార్కుల్లో టౌన్షిప్ల నిర్మాణ పనులు ముందుకు సాగక కార్మికులు అగచాట్లు పడుతున్నారు. పారిశ్రామిక వాడల్లోగానీ, వాటికి సమీపాల్లో గానీ నివాస వసతి లేక దూరప్రాంతాల్లో ఉంటూ వ్యయప్రయాసలకోర్చి పనులకు
పారిశ్రామిక పార్కుల్లో వసతుల లేమి
ఊసేలేని టౌన్షిప్ల నిర్మాణం
రాకపోకలకు కార్మికుల అవస్థలు
నెరవేరని మంత్రి కేటీఆర్ హామీ
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలోని కొత్త పారిశ్రామిక పార్కుల్లో టౌన్షిప్ల నిర్మాణ పనులు ముందుకు సాగక కార్మికులు అగచాట్లు పడుతున్నారు. పారిశ్రామిక వాడల్లోగానీ, వాటికి సమీపాల్లో గానీ నివాస వసతి లేక దూరప్రాంతాల్లో ఉంటూ వ్యయప్రయాసలకోర్చి పనులకు రావాల్సి వస్తోంది. రాష్ట్రంలో 156 పారిశ్రామిక పార్కులున్నాయి. ఇందులో 16 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. త్వరలో మరో 12 ప్రారంభం కానున్నాయి. నైపుణ్యం ఉన్నవారితో పాటు లేని వారికి సైతం పనులు దొరుకుతున్నందున పెద్ద సంఖ్యలో కార్మికులు పనుల్లో చేరుతున్నారు. ఇంకా నాలుగులక్షల మందికి పైగా కార్మికుల అవసరం ఉందని పరిశ్రమల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో పరిశ్రమల ఏర్పాటును నిషేధించింది. నగరానికి దూరంగా 26 కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసింది. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పారిశ్రామిక పార్కుల కోసం రహదారులను నిర్మించింది. వాటిల్లో నీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను కల్పించింది. కార్మికుల వసతులకు మాత్రం ఇబ్బందులున్నాయి. పారిశ్రామిక పార్కులకు రవాణా వసతి లేదు. బస్సులు, ఆటోలు వెళ్లడం లేదు. దీంతో కార్మికులు దూరంగా ఉన్న బస్స్టాప్ల వద్ద, ఆటో స్టాండ్ల వద్ద దిగి పరిశ్రమలకు వస్తున్నారు.
ముందుకెళ్లని ప్రతిపాదనలు
కొత్త పారిశ్రామికపార్కుల ఏర్పాటు సందర్భంగా కార్మికులకు నివాస వసతి గురించి పరిశ్రమల సంఘాలు, యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వీటిపై స్పందించి... పారిశ్రామికపార్కుల వద్ద టౌన్షిప్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమీకృత టౌన్షిప్ విధానంలో దీనిని చేర్చారు. దీనికి అనుగుణంగా ఎక్కువ విస్తీర్ణం గల పారిశ్రామిక పార్కుల్లో కొంత స్థలాన్ని టౌన్షిప్ల కోసం ఏర్పాటు చేసి ఇళ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. తక్కువ విస్తీర్ణం గల ప్రాంతాల్లో కార్మికులకు కనీస వసతులతో కూడిన డార్మెటరీ తరహా గదులను నిర్మించాలని భావించారు. దీనిలో భాగంగా కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మాదాపూర్, వరంగల్లలో పారిశ్రామిక టౌన్షిప్ల ఏర్పాటు, దండుమల్కాపూర్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులోనూ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు.
దండుమల్కాపూర్ పారిశ్రామిక పార్కులోని పరిశ్రమలో శ్రీనివాస్ కార్మికుడు. అక్కడికి 45 కిలోమీటర్ల దూరం నుంచి రోజూ అక్కడికి వస్తూ, పోతున్నారు. పార్క్కు సమీపంలో ఉండడానికి ఇళ్లు లేకపోవడంతో రోజూ రాకపోకలకు ఇబ్బంది అవుతోందని తెలిపారు.
సుల్తాన్పూర్లోని వైద్యపరికరాల పార్కులోని యంత్రాల తయారీ పరిశ్రమలో పనిచేసే రాజం అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోని సంగారెడ్డి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
నివాస వసతి కల్పించాలి
పారిశ్రామిక పార్కులతో పాటు టౌన్షిప్ల ఏర్పాటు అటు కార్మికులతో పాటు ఇటు పరిశ్రమలకు ప్రయోజనకరం. నివాస వసతుల్లేక కార్మికులు కార్యాలయ వేళల మాదిరే పనిచేస్తున్నారు. రెండు, మూడు షిప్ట్ల్లో పనిచేసే అవకాశం ద్వారా పరిశ్రమల్లో ఉత్పత్తులు పెరగడంతో పాటు కార్మికులకు మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం పారిశ్రామిక విధానంలోనూ దీనిని చేర్చాలి.
- దామోదరాచారి, పారిశ్రామికవేత్త
నూతన భారీ ప్రాజెక్టుల్లో ఏర్పాటుకు చర్యలు
తెలంగాణలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి భారీ ప్రాజెక్టు వద్ద టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ ఔషధనగరిలో పెద్దఎత్తున టౌన్షిప్లుంటాయి. జహీరాబాద్ నిమ్జ్లోనూ దీనిని ప్రతిపాదించాం. దండుమల్కాపూర్లో ప్రాజెక్టుపై కార్యాచరణ మొదలైంది. కార్మికుల వసతి దృష్ట్యా కాలుష్యరహితంగా అన్ని పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దుతున్నాం.
- వెంకటనర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్