Nirmala Sitharaman: కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవీ రాష్ట్ర రుణాలే
ఆర్బీఐ ద్వారా తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాలే కాకుండా.. కొన్ని రాష్ట్రాలు తమ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సాధనాల ద్వారా రుణాలు తీసుకుని వాటికి సంబంధించిన అసలు, వడ్డీని బడ్జెట్ నుంచే చెల్లిస్తున్నట్లు
ఈ విషయమై ఇప్పటికే హెచ్చరించాం
తెలంగాణ అప్పు రూ.3.12 లక్షల కోట్లు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఏపీ రుణం రూ.3.98 లక్షల కోట్లని వెల్లడి
ఈనాడు, దిల్లీ: ఆర్బీఐ ద్వారా తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాలే కాకుండా.. కొన్ని రాష్ట్రాలు తమ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సాధనాల ద్వారా రుణాలు తీసుకుని వాటికి సంబంధించిన అసలు, వడ్డీని బడ్జెట్ నుంచే చెల్లిస్తున్నట్లు ఆర్థికశాఖ దృష్టికి వచ్చినట్లు నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల భారంపై భాజపా సభ్యుడు కిషన్ కపూర్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ పలు అంశాలను వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నికర రుణ పరిమితిని ఉల్లంఘిస్తూ పక్కదారుల్లో రుణాలు తీసుకోవడం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై మార్చిలో రాష్ట్రాలను హెచ్చరించినట్లు చెప్పారు. ఇలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సాధనాల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ నుంచి కానీ, లేదంటే రాష్ట్ర పన్నులు, సెస్సులు, ఇతర ఆదాయాలను అసైన్మెంట్ చేసి కానీ చెల్లిస్తే వాటిని ఆర్టికల్ 293(3) కింద రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకిందే పరిగణిస్తామని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
ఏపీది 8, తెలంగాణది 11వ స్థానం
ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని అనుసరించి కేంద్రం అనుమతించిన నికర రుణ పరిమితి మేరకు బహిరంగ మార్కెట్ నుంచి చేసిన అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి. దేశంలోని 28 రాష్ట్రాలు కలిపి 2022 మార్చి చివరి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.68 లక్షల కోట్లు అప్పు చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.3,98,903 కోట్లు, తెలంగాణ వాటా రూ.3,12,191 కోట్లుగా ఉంది. 2020 నుంచి 2022 మధ్య ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.91,232 కోట్లు పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ చేసిన రుణం రూ.86,773 కోట్లు.
అప్పుల ఊబిలోకి రాష్ట్రం: ఎంపీ ఉత్తమ్
ఈనాడు, దిల్లీ : ఇష్టారీతిగా అప్పులు చేస్తూ తెలంగాణను రుణాల ఊబిలోకి నెడుతున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు తీసుకోవడం సరికాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో వెల్లడించారని ఆయన చెప్పారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమేనన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో దానిని రూ.3.12 లక్షల కోట్లకు తెరాస ప్రభుత్వం పెంచిందని ఆయన మండిపడ్డారు.
సుప్రీంలో కేసులు తేలిన తర్వాతే తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు పరిశీలన
- హామీల అమలు కమిటీకి చెప్పిన కేంద్ర హోంశాఖ
ఈనాడు, దిల్లీ: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభా దృష్ట్యా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 నుంచి 62 శాతానికి పెంచేందుకు 2017లో చేసిన బిల్లుపై తదుపరి ప్రక్రియను సుప్రీంకోర్టులో ఉన్న సివిల్ అప్పీల్ నంబర్ 2628, 2637/2010 కేసులు తేలాకే చేపడతామని తాజాగా కేంద్ర హోంశాఖ పార్లమెంటు హామీల అమలు కమిటీకి చెప్పింది. న్యాయశాఖ, ఇతర శాఖలతో సంప్రదించి ఈ బిల్లును పరిశీలిస్తున్నట్లు 2018 ఆగస్టు 6న అప్పటి తెరాస ఎంపీ సీతారాంనాయక్ అడిగిన ప్రశ్నకు అప్పటి గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి బదులిచ్చారు. దీనిపై మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలి. కానీ, ఇప్పటివరకూ తీసుకోకపోవడంతో అది హామీల అమలు కమిటీ ముందుకు వచ్చింది. అయితే, రిజర్వేషన్లు 50 శాతానికి మించే అంశంపై దాఖలైన రెండు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే ఈ బిల్లుపై తదుపరి కార్యాచరణకు అవకాశం ఉన్నందున సభా ముఖ హామీని పక్కనపెట్టాలని హోంశాఖ.. కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఇందులోని పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత కమిటీ అందుకు ఆమోదముద్ర వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..