కణజాల ఇన్ఫెక్షన్ కలకలం
కాలికి కట్టుతో కనిపిస్తున్న ఈ యువకుడు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన గడ్డం అనిల్ (37). కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిది రోజుల కిందట రాత్రి పూట తీవ్ర చలి జ్వరం రావడంతో
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో నమోదవుతున్న కేసులు
సరైన సమయంలో చికిత్స పొందాలి
లేకపోతే ప్రాణాంతకమంటున్న నిపుణులు
కాలికి కట్టుతో కనిపిస్తున్న ఈ యువకుడు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన గడ్డం అనిల్ (37). కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిది రోజుల కిందట రాత్రి పూట తీవ్ర చలి జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స తీసుకున్నారు. తెల్లారేసరికి ఎడమ కాలు వాపు రావడంతో పాటు పొక్కులు వచ్చి చూస్తుండగానే బొబ్బలుగా మారాయి. ఆందోళనకు గురైన ఆయన జిల్లా కేంద్రంలోని వైద్యులను సంప్రదించారు. వారు పరీక్షించి ‘కణజాల ఇన్ఫెక్షన్(సెల్యులైటిస్)’గా నిర్ధారించారు. అప్పటికే కాలంతా ఇన్ఫెక్షన్కు గురైనట్టు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో కోలుకుంటున్నారు.
ఈనాడు, హైదరాబాద్, ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, కేసముద్రం, న్యూస్టుడే: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వలలో సెల్యులైటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధితో గ్రామంలో మరికొంతమంది బాధ పడుతున్నారని, ఇందులో ఒకరు ఇటీవలే మృతి చెందారని గ్రామస్థులు చెబుతున్నారు. 2018లోనూ కల్వలతో పాటు పక్కనే ఉన్న అమీనాపురం, కోమటిపల్లి, వాటి శివారు తండాల్లో ఈ వ్యాధి సోకి పలువురు ఆసుపత్రి పాలవగా.. మళ్లీ ఇప్పుడు బాధితులు ఎక్కువవుతుండడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. కల్వలలో పలువురికి సెల్యులైటిస్ వ్యాధి సోకినట్టు తమ దృష్టికి వచ్చిందని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి వైద్యుడు వినిల్రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు ఇంటింటా సర్వే చేపట్టినట్లు కల్వల ఆరోగ్య ఉపకేంద్రం వైద్యురాలు అంజనీశర్మ తెలిపారు.
ఏమిటీ సెల్యులైటిస్?
సెల్యులైటిస్ అంటే సాధారణ భాషలో శరీరంలోని కణజాలానికి ఇన్ఫెక్షన్ సోకడం. స్ట్రెప్టొకొకస్, స్టాఫిలోకొకస్ బ్యాక్టీరియాల కారణంగా సోకే ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఇది. మురుగు నీటిలో కాళ్లు తడవడం, అపరిశుభ్ర వాతావరణంలో ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి. కాళ్లకు అప్పటికే గాయాలు, పుండ్లు, కోతలు, కాట్లు ఉన్న వ్యక్తుల్లో.. సులువుగా బ్యాక్టీరియా శరీరం లోనికి ప్రవేశిస్తుంది. ఇటీవల వర్షాలు విపరీతంగా కురుస్తుండడం, వరదలు ముంచెత్తడం తదితర పరిణామాలతో పరిసరాలు అపరిశుభ్రమై.. ఈ వాతావరణంలో బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. శరీరంలోని ఏ భాగానికైనా సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ సోకవచ్చు. ఎక్కువగా శరీరంలోని కింది భాగాలకు.. అందులోనూ ముఖ్యంగా కాళ్లకు సోకుతుంది.
లక్షణాలు ఇలా..
* నొప్పి సలపడం
* ముట్టుకుంటే భరించలేనంతగా నొప్పి
* వాపు, వణుకు
* వెచ్చదనంగా అనిపించడం
* ఎర్రని, నీలి రంగులో పొక్కులు రావడం
* చర్మం ఎర్రబడడం
* బొబ్బలు వచ్చి స్రావాలు కారడం
* చర్మంపై నొక్కితే గుంటలు పడుతుండడం
* జ్వరం, అలసట
త్వరగా గుర్తిస్తే చికిత్స సులభం
- డాక్టర్ మనోహర్, జనరల్ ఫిజీషియన్
సెల్యులైటిస్ అనేది సాధారణ జబ్బే. అడపాదడపా కేసులు వస్తుంటాయి. అయితే ఒకే ఊరిలో, ఒకేసారి, ఎక్కువమందికి రావడం కొంచెం ఆశ్చర్యానికి గురిచేసేదే. ముందుగా రాత్రి పూట తీవ్ర చలి జ్వరం వస్తుంది. తర్వాత కాళ్లకు బొబ్బలు వస్తాయి. పుండ్లు ఏర్పడతాయి. రెండు మూడు రోజుల్లోనే ఇన్ఫెక్షన్ కాలు మొత్తం విస్తరిస్తుంది. చర్మం పైపొరనే కాకుండా లోపలి చర్మాన్ని కూడా చీలుస్తుంది. అతి వేగంగా కణాల్లో వ్యాప్తి చెందుతుంది. చర్మం ఎర్రగా మారుతుంది. పొక్కులొస్తాయి. పుండుగా మారుతుంది. త్వరగా గుర్తిస్తే చికిత్స సులభమే. సాధారణంగా 2 వారాలు, అవసరమైతే 4-6 వారాలు చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇన్ఫెక్షన్ శరీరంలోనికి ప్రవేశించి సెప్టిసీమియా(రక్తంలో ఇన్ఫెక్షన్)కు దారి తీస్తుంది. తద్వారా ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ప్రమాదకరంగా మరే అవకాశాలుంటాయి. మురుగునీటిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!