Train Charges: డైనమిక్ ఛార్జీల పిడుగు
రాయితీ ప్రయాణాలను అనేక వర్గాలకు దూరం చేసిన రైల్వే శాఖ సాధారణ ప్రయాణాలపైనా భారం వేసి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. అనేక రైళ్లలో డైనమిక్ ఛార్జీల విధానాన్ని అమలుచేసేందుకు అధికారులు ప్రయత్నాలు
డిమాండ్ ఉన్న ప్రధాన రైళ్లపై రైల్వే శాఖ దృష్టి
కసరత్తు మొదలుపెట్టిన అధికారులు
ప్రయాణికులపై భారీగా పెరగనున్న భారం
ఈనాడు, హైదరాబాద్: రాయితీ ప్రయాణాలను అనేక వర్గాలకు దూరం చేసిన రైల్వే శాఖ సాధారణ ప్రయాణాలపైనా భారం వేసి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. అనేక రైళ్లలో డైనమిక్ ఛార్జీల విధానాన్ని అమలుచేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్లో మూడు రైళ్లలోనే ఈ విధానం అమల్లో ఉంది.
టికెట్ల ఆదాయం పెంపే లక్ష్యం
హైదరాబాద్ నుంచి దిల్లీ, విశాఖపట్నం, తిరుపతికి వెళ్లే రూట్లలో డిమాండ్ బాగా ఉంటుంది. ప్రయాణ తేదీకి చాలారోజుల ముందే రిజర్వేషన్లు అయిపోయే, నిరీక్షణ జాబితా వందల సంఖ్యలో ఉండే రైళ్లపై.. ద.మ.రైల్వే అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా ఏయే రైళ్లలో డైనమిక్ టికెట్ విధానాన్ని అమలు చేయాలన్న విషయంపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రైలు బయల్దేరే సమయానికి కొద్ది గంటల ముందు ప్రయాణం పెట్టుకునే, అత్యవసరంగా ప్రయాణాలు చేసేవారి కోసమే ఈ విధానం అని రైల్వేశాఖ చెబుతున్నప్పటికీ అసలు లక్ష్యం టికెట్ల ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు.
భారీగా ఛార్జీల భారం
డైనమిక్ ఛార్జీలు ఉండే రైళ్లలో మొదటి 10 శాతం సీట్లకే సాధారణ ఛార్జీలు ఉంటాయి. ఉదాహరణకు స్లీపర్లో 720 బెర్తులు ఉంటే 73వ బెర్తు నుంచి ఛార్జీలు పెరుగుతుంటాయి. అదనపు బాదుడును తప్పించుకోవాలంటే ఒకట్రెండు నెలల ముందే ప్రయాణ తేదీపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రయాణ తేదీకి ఎంత తక్కువ వ్యవధికి ముందు రిజర్వేషన్ తీసుకుంటే ఛార్జీల భారం అంత పెరుగుతుంది.
* డైనమిక్లో మొదటి 10 శాతం టికెట్లకే బేస్ ప్రైస్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 10 శాతం టికెట్లకు 10 శాతం చొప్పున ఛార్జీ పెరుగుతుంది. 11-20 శాతం టికెట్లపై అదనంగా 10 శాతం, 21-30 శాతం టికెట్లకు 20 శాతం, 31-40 శాతం టికెట్లకు 30 శాతం..41-50 శాతం టికెట్లకు అదనంగా 40% ఛార్జీల్ని భరించాలి. మిగిలిన 51-100 శాతం టికెట్లకు 50% ఛార్జీ అధికంగా ఉంటుంది. రిజర్వేషన్ ఛార్జీలు, కేటరింగ్ ఛార్జీల్లో మార్పు ఉండదు.
* ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి దిల్లీ వెళ్లే దురంతో, రాజధాని రైళ్లలో, విశాఖపట్నం వెళ్లే దురంతోలో మాత్రమే ఈ విధానం అమలవుతోంది.
బాదుడు తేడా ఎంతెంతంటే?
రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే.. రాజధాని, దురంతో వంటి డైనమిక్ ఛార్జీలు ఉండే రైళ్లలో ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఆ ఛార్జీల తేడాలిలా..
దిల్లీలో తెలంగాణ, సంపర్క్క్రాంతి, దక్షిణ, హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ ఛార్జీలు ఉంటే.. రాజధాని, దురంతోలో డైనమిక్ ఛార్జీలు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వైపు రోజుకు దాదాపు 10 రైళ్లు ఉంటే డైనమిక్ ఛార్జీల రైలు దురంతో ఒకటే ఉంది. ఈ రూట్లలో మిగతా రైళ్లలో, ఇతర రూట్లలో దశలవారీగా డజన్ల సంఖ్యలో ప్రధాన రూట్లలో డైనమిక్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!