అమెరికాను తలదన్నేలా రహదారుల అభివృద్ధి
అమెరికాను తలదన్నేలా భారత్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. 2014కు ముందు దేశంలో 90 వేల కి.మీ. జాతీయ
కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మాదాపూర్, న్యూస్టుడే: అమెరికాను తలదన్నేలా భారత్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. 2014కు ముందు దేశంలో 90 వేల కి.మీ. జాతీయ రహదారులు ఉంటే.. గడిచిన 8 ఏళ్లలో మరో 70 వేల కి.మీ. రహదారులను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. శుక్రవారం మాదాపూర్ హైటెక్స్లో బస్, కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఓసీఐ), ఏపీ, తెలంగాణ స్టేట్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ప్రవాస్ 3.0’ పేరిట ప్రజారవాణా వాహనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనిని కిషన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘దేశ ప్రగతిలో రోడ్డు కనెక్టివిటీ కీలకాంశం. జాతీయ రహదారులను మెరుగుపర్చడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. దేశవ్యాప్తంగా 92 పర్యాటక, ఆతిథ్యరంగ శిక్షణసంస్థలు ఉన్నాయి. వాటిలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ట్రావెల్స్ అండ్ టూరిజంకు సంబంధించిన సిలబస్ను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం. విదేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో భారత పర్యాటక కార్యాలయాలను ప్రారంభించనున్నాం. కరోనా కారణంగా టూర్ అండ్ ట్రావెల్ సంస్థలు ఎంతో నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఈ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం’’అని వివరించారు. వేర్వేరు కంపెనీలు ప్రదర్శనకు ఉంచిన ప్రయాణికుల బస్సులను మంత్రి పరిశీలించారు. 2 రోజులపాటు కొనసాగే ఈ ప్రదర్శనలో వాహన తయారీ కంపెనీలు అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన బస్సులు, మినీ బస్సులతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. కార్యక్రమంలో బీవోసీఐ అధ్యక్షుడు ప్రసన్న పట్వర్ధన్, ఛైర్మన్ జగ్దియోసింగ్ ఖల్సా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువుల కబ్జాలతో ముప్పే
చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
నల్గొండ, ఖమ్మం గరంగరం
ఖమ్మం నగరం నిప్పుల కుంపటిలా మారింది. ఇక్కడ మంగళ, బుధవారాల్లో వడగాలులు వీచాయి. బుధవారం సాధారణం కన్నా ఏకంగా 6 డిగ్రీలు పెరిగి 43.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
సంక్షిప్త వార్తలు
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!