మూడేళ్లలో ఎన్హెచ్ఎం కింద రూ.2,361 కోట్ల విడుదల
ఈనాడు, దిల్లీ: నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణకు 2019-20లో రూ.964.34 కోట్లు, 2020-21 రూ.671.88 కోట్లు, 2021-22 రూ.725.67 కోట్లు కలిపి మొత్తం రూ.2,361.89 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. అలాగే క్షయ నిర్మూలన కోసం రూ.145.9 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఎన్జేఐఏఐపై ఏకాభిప్రాయం రాలేదు: కిరణ్రిజిజు
నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్జేఐఏఐ) ఏర్పాటుపై ఇటీవల జరిగిన రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సులో ఏకాభిప్రాయం రాలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అందువల్ల ఆ ప్రతిపాదనను అంగీకరించలేదన్నారు. శుక్రవారం లోక్సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ‘‘కోర్టుల్లో అవసరమైన వసతుల కల్పన కోసం ఎన్జేఐఏఐ ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదనలు అందాయి. వీటిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపి అభిప్రాయం కోరాం. ఆ అంశంపై ఏప్రిల్ 30న జరిగిన ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనూ చర్చజరిగింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు’’అని రిజిజు తెలిపారు.
ఫ్రైట్ కారిడార్లను మంజూరు చేయలేదు.. సర్వే ప్రారంభం
రైల్వేశాఖ విజయవాడ మీదుగా సాగే రెండు ఫ్రైట్ కారిడార్లపై సర్వే, డీపీఆర్ తయారీ పనులు మొదలుపెట్టినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఖరగ్పుర్-విజయవాడ(1,115 కేఎం) మధ్య ఈస్ట్కోస్ట్ కారిడార్, విజయవాడ-ఇటార్సీ(975 కిమీ) మధ్య ఉత్తర-దక్షిణ ఉపకారిడార్లపై ప్రస్తుతం సర్వే, డీపీఆర్ తయారీ పనులు సాగుతున్నట్లు చెప్పారు. అయితే ఈ రెండు ఫ్రైట్ కారిడార్లనూ ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు. కొత్త కారిడార్ల మంజూరు నిర్ణయం డీపీఆర్లో వెల్లడయ్యే వివరాలు, సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్యాలు, ఆర్థిక సుస్థిరత, నిధుల ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు చెప్పారు.
మత్స్యసంపద యోజన కింద తెలంగాణలో 93,203 మందికి లబ్ధి
ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 2020-21, 2021-22లో తెలంగాణ నుంచి 93,203మందికి లబ్ధి చేకూరినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఈ రెండేళ్లలో తెలంగాణలో రూ.147.20 కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి కేంద్ర వాటా కింద రూ.52.13 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఈ పథకం వల్ల చేపల ఉత్పత్తి 2019-20, 2021-22 సంవత్సరాల మధ్య 3లక్షల నుంచి 3.90 లక్షల టన్నులకు చేరినట్లు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష
-
General News
Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
-
Sports News
Sunil Chhetri : అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దు!
-
Viral-videos News
Video: ఇళ్ల మధ్యలోకి మొసలి.. భయంతో వణికిన జనం!
-
World News
Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
-
Sports News
Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Ukraine Crisis: ఉక్రెయిన్లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Liger: సూపర్స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Crime News: బిహార్లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
- Video: ఇళ్ల మధ్యలోకి మొసలి.. భయంతో వణికిన జనం!
- UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో.. ముందంజలో లిజ్ ట్రస్..!
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Cheteshwar Pujara : చితక్కొట్టిన పుజారా.. వరుసగా రెండో శతకం
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్ఛైర్లో ఝున్ఝున్వాలా డ్యాన్స్
- Social Look: మహేశ్బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్లో నయన్!