Telangana news: డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 282 మంది ఖైదీలు
వారంతా క్షణికావేశంలో నేరాలు చేసి ఖైదీలయ్యారు.. జైలు జీవితంలోనూ వారిలో చదువుకోవాలనే కాంక్ష ప్రబలంగా కలిగింది. అప్పటికే డిగ్రీ పూర్తి చేసి ఉంటే పీజీ, ఇంటర్ చదివి ఉంటే డిగ్రీ.. ఇలా తమకు
ముగ్గురికి బంగారు పతకాలు
అంబేడ్కర్ వర్సిటీ స్నాతకోత్సవం
పాల్గొన్న గవర్నర్ తమిళిసై
ఈనాడు, హైదరాబాద్; మాదాపూర్, న్యూస్టుడే: వారంతా క్షణికావేశంలో నేరాలు చేసి ఖైదీలయ్యారు.. జైలు జీవితంలోనూ వారిలో చదువుకోవాలనే కాంక్ష ప్రబలంగా కలిగింది. అప్పటికే డిగ్రీ పూర్తి చేసి ఉంటే పీజీ, ఇంటర్ చదివి ఉంటే డిగ్రీ.. ఇలా తమకు నచ్చిన కోర్సును ఎంచుకుని దూరవిద్యలో చదువుకున్నారు. వీరిలో ముగ్గురు ఏకంగా బంగారు పతకాలనే సాధించి ఔరా అనిపించారు. మరికొందరు ఎమ్మెస్సీని సైతం పూర్తి చేసి శెభాష్ అనిపించుకున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల జైళ్లలో ఖైదీలుగా ఉన్న వారిలో 282 మంది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం దూరవిద్యలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేశారు. వీరిలో 261 మంది పురుషులు కాగా.. మరో 21 మంది మహిళా ఖైదీలున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న షేక్ అజారుద్దీన్ డిగ్రీలో.. కడప కేంద్ర కారాగారంలో ఉన్న కె.సురేశ్రెడ్డి, ఎన్.రమేశ్బాబు పీజీలో బంగారు పతకాలు సాధించడం విశేషం. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ 24వ స్నాతకోత్సవం శనివారం హైదరాబాద్లో నిర్వహించారు. దీనికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై.. చదువులో ఎదురయ్యే సవాళ్లను విద్యార్థులు ఎదుర్కొని ముందుకు సాగితే విజయాలు సాధ్యమవుతాయని ఉద్బోధించారు. ఈ సందర్భంగా కెనడాలోని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (సీవోఎల్) అధ్యక్షురాలు ప్రొ.ఆశాసింగ్ కన్వర్కు గవర్నర్, వర్సిటీ కులపతి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందించారు. ముఖ్యఅతిథి ప్రొ.ఆశాసింగ్ కన్వర్, వర్సిటీ ఉపకులపతి(వీసీ) ప్రొ.కె.సీతారామారావు ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 79,968 మంది విద్యార్థులకు పట్టాలు, 128 మందికి బంగారు పతకాలు అందిస్తున్నట్లు వీసీ చెప్పారు.
తల్లి చేతిలో బంగారు పతకమయ్యాడు
అమ్మకు చేదోడువాదోడుగా ఉంటూనే ఆ యువకుడు ఎమ్మెస్సీ పూర్తిచేసి బంగారు పతకం సాధించారు. దాన్ని అందుకునేలోగా గుండెపోటుతో 27 ఏళ్లకే ఈ లోకానికి దూరమయ్యారు. కుమారుడి స్థానంలో బంగారు పతకం అందుకుని కన్నీటిపర్యంతమయ్యారు ఆ తల్లి. అంబేడ్కర్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరుకు చెందిన తాళ్లపాక బాలసాయి సునీత్ అలోక్ (27) తల్లి నాగలక్ష్మి అంగన్వాడీ కార్యకర్త. తండ్రి లేకపోవడంతో కుమారుడిని ఆమే చదివించింది. డిగ్రీ అయ్యాక గ్రామవాలంటీర్గా పనిచేస్తూ.. కడపలోని అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య కేంద్రం నుంచి గతేడాది ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశాడు. టాపర్గా నిలిచి బంగారు పతకం సాధించాడు. అతనికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు ముందుగా గుర్తించలేదు. ఐదు నెలల కిందట నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడు. ‘‘అలోక్ చిన్నప్పటి నుంచి పది, ఇంటర్, డిగ్రీలో టాపర్గా నిలిచాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడతాడనుకున్న దశలో మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడు’’ అంటూ నాగలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల