రాష్ట్రపతి ముర్ముతో గవర్నర్‌ తమిళిసై భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Published : 07 Aug 2022 04:53 IST

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సమావేశంలో పాల్గొనేందుకు గవర్నర్‌ దిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు గవర్నర్‌ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు