సంక్షిప్త వార్తలు (9)
ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వోలకు మనోధైర్యం కల్పించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఆదివారం హైదరాబాద్లో సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి
నేడు రెవెన్యూ ఉద్యోగుల భావి కార్యాచరణ సభ
ఈనాడు, హైదరాబాద్: ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వోలకు మనోధైర్యం కల్పించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఆదివారం హైదరాబాద్లో సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భాజపా నుంచి ఈటల, బీఎస్పీ నుంచి ప్రవీణ్కుమార్, తెజస నుంచి కోదండరాం, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆప్ పార్టీల నాయకులు పాల్గొంటారని తెలిపారు.
డయాలసిస్ రోగులకు పింఛనుపై హర్షం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని డయాలసిస్ రోగులకు సీఎం కేసీఆర్ రూ.2,016 పింఛను ప్రకటించడంపై తెలంగాణ బోధన ఆసుపత్రుల ప్రభుత్వ వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్కు కృతజ్ఞత తెలిపారు. కనీసం 10,500 మందికి లబ్ధిచేకూరనుందని వెల్లడించారు.
వినియోగదారుల కమిషన్లకు జ్యుడిషియల్ అధికారాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర వినియోగదారుల కమిషన్, జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులకు ‘మొదటి తరగతి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్’ అధికారాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 72(2) కింద.. కమిషన్ సభ్యులకు ఈ అధికారాలు వర్తిస్తాయని ఎక్స్అఫిషియో కార్యదర్శి వి.అనిల్కుమార్ జీవోలో పేర్కొన్నారు.
వీఆర్వోల బదిలీ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం
ఆ విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది: వీఆర్వో ఐకాస
ఈనాడు, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ ఉద్యోగుల(వీఆర్వోల)ను రాజ్యాగ నిబంధనలకు, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తున్నారని వీఆర్వో ఐకాస అధ్యక్షుడు గోల్కొండ సతీష్, ఉపాధ్యక్షుడు జె.రవి నాయక్, అదనపు కార్యదర్శి పల్లెపాటి నరేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీలపై తాము హైకోర్టును ఆశ్రయించగా ప్రక్రియను బలవంతంగా చేపట్టవద్దంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. రెవెన్యూశాఖలో ఖాళీలు ఉండగా అదనపు సిబ్బందిగా వీఆర్వోలను ఎలా గుర్తిస్తారని, ఉద్యోగ/సర్వీస్ భద్రత, సీనియారిటీ, పదోన్నతుల పరిరక్షణ లేకుండా బదిలీ చేయడం తప్పని వారు పేర్కొన్నారు.
మైనార్టీ విద్యార్థుల కేంద్ర ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటి నుంచి 10 వరకు చదువుతున్న ప్రీమెట్రిక్ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా, ఇంటర్ ఆ పైన చదివే పోస్టుమెట్రిక్ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు https://scholarships.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తులు అందజేయాలని, దరఖాస్తు చేసుకునేముందు అర్హతలు పరిశీలించుకోవాలంది.
స్వాతంత్య్ర కవాతుకు గిరిజన గురుకుల విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్: దిల్లీ ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ కవాతులో పాల్గొనేందుకు తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. మరిపెడ, మణుగూరు, కొత్తగూడెం గురుకులాలకు చెందిన డి.త్రివేణి, నంద కేశవ్, నవీన్, విష్ణు పరేడ్లో పాల్గొననున్నారు. ఖమ్మం ఎన్సీసీ క్యాంపులో నిర్వహించిన కార్యక్రమంలో త్రివేణి, నందకేశవ్ ఎంపికవగా, కాకినాడలో నిర్వహించిన ఏక్భారత్ శ్రేష్ఠభారత్ కార్యక్రమంలో బి.నవీన్, బి.విష్ణు ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు: సీఎస్
ఈనాడు, హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్కుమార్ ఆదేశించారు. డీజీపీ మహేందర్రెడ్డితో కలసి ఆయన అన్ని శాఖల ఉన్నతాధికారులతో శనివారం బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. ‘‘8న హైదరాబాద్ హెచ్ఐసీసీలో వజ్రోత్సవాలను సీఎం ప్రారంభిస్తారు. 9 నుంచి 21వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో వజ్రోత్సవాలు జరుగుతాయి. వీటిలో ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల ప్రజలను భాగస్వామ్యం చేయాలి. విద్యార్థుల కోసం రాష్ట్రంలోని దాదాపు 563 సినిమా హాళ్లలో ‘గాంధీ’ చలనచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఈ సినిమాను సుమారు 35 లక్షల మంది ఉచితంగా వీక్షించనున్నారు. 15న గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతుంది. సీఎం కేసీఆర్ జెండాను ఎగురవేస్తారు’’ అని సీఎస్ వివరించారు.
అగ్రి ఉడాన్ అయిదో దశ ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ(నార్మ్)లో అంకుర సంస్థలను మరింతగా ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘అగ్రి ఉడాన్’ కార్యక్రమం అయిదో దశను శనివారం ప్రారంభించినట్లు సంస్థ సంచాలకుడు సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. అంకుర సంస్థల ఏర్పాటు, నిర్వహణ, వాణిజ్యం అభివృద్ధి వరకూ పర్యవేక్షించేందుకు ఈ సంస్థలో ‘ఎ-ఐడియా’ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ కేంద్రం పనిచేస్తోందన్నారు. ఆహార, వ్యవసాయ వాణిజ్యంలో కొత్త ఆలోచనలతో వచ్చే వారికి ఈ కేంద్రం సహకరిస్తుందన్నారు. అగ్రి ఉడాన్-5 ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన పలువురు వక్తలు అంకుర సంస్థల అభివృద్ధిపై సూచనలు చేశారు.
భీమిలి వైకాపా ఎంపీపీ ఇళ్లలో ఐటీ సోదాలు
విశాఖపట్నం (గ్రామీణ భీమిలి), న్యూస్టుడే: విశాఖపట్నం జిల్లా భీమిలి వైకాపా మండల పరిషత్తు అధ్యక్షుడు డి.వాసురాజు ఇళ్లలో ఆదాయపన్ను విభాగం సోదాలు చేసిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. భీమిలి మండలం అమనాంలో, విశాఖ నగరంలోని ఇళ్లలో, మద్దిలపాలెంలోని ఆయన స్థిరాస్తి వ్యాపార సంస్థ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. నాలుగు రోజులుగా సోదాలు సాగుతున్నాయని, ముఖ్యమైన పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదు తనిఖీ చేశారు. కొద్దిరోజుల కిందట వాసురాజుకు, నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఐటీ సోదాల అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు