మన్ననూరులో మట్టి ఇళ్లు
మహారాష్ట్రలోని తడోబా, రాజస్థాన్లోని రణతంబోర్ తరహాలో అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు పర్యాటకుల్ని పెద్దసంఖ్యలో ఆకర్షించడంపై అటవీశాఖ దృష్టి సారించింది. నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులు బస చేసేలా వసతి ఏర్పాట్లు,
టైగర్ సఫారీ పర్యాటకులకు కొత్త వాహనాలు?
నల్లమల అడవుల్లో పర్యాటకం పెంపుపై అటవీశాఖ యోచన
ఈనాడు, హైదరాబాద్: మహారాష్ట్రలోని తడోబా, రాజస్థాన్లోని రణతంబోర్ తరహాలో అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు పర్యాటకుల్ని పెద్దసంఖ్యలో ఆకర్షించడంపై అటవీశాఖ దృష్టి సారించింది. నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులు బస చేసేలా వసతి ఏర్పాట్లు, పులుల సఫారీలో తిరిగేందుకు తగినన్ని సరికొత్త వాహనాల్ని సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది.
పెరుగుతున్న పర్యాటకులు
నల్లమల అటవీ ప్రాంతానికి వచ్చే ప్రకృతి పర్యాటకుల సంఖ్య కొంతకాలంగా పెరుగుతోంది. టైగర్ రిజర్వులో తిరిగేందుకు రెండే సఫారీ వాహనాలున్నాయి. దీంతో ముందే బుక్ చేసుకున్నవారికి తప్ప నేరుగా వచ్చేవారికి వాహనాల్ని సమకూర్చలేకపోతున్నారు. సమస్య పరిష్కారానికి ఐదారు సఫారీ వాహనాల కొనుగోలుకు అనుమతివ్వాలని అమ్రాబాద్ టైగర్ రిజర్వు అధికారుల నుంచి ప్రధాన అటవీ సంరక్షణ అధికారి(పీసీసీఎఫ్)కి ప్రతిపాదనలు అందాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే వాహనాల్ని కొనుగోలు చేయాలని అటవీశాఖ భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలనూ పరిశీలిస్తున్నారు.
మోడల్ గృహాల నిర్మాణం
పర్యాటకుల వసతి కోసం మన్ననూరులో అటవీశాఖ కాటేజీ(వనమాలిక)లు ఆరే ఉన్నాయి. వాటిలో 12 మందికే వసతి సరిపోతుంది. ఈ క్రమంలో అదనపు వసతి ఏర్పాట్ల కోసం మట్టి గృహాలు నిర్మించాలని అటవీశాఖ నిర్ణయించింది. శాఖ పరంగా ఓ నమూనాను ఏర్పాటు చేసి ఆ తర్వాత స్థానికులతో సొంతంగా కాటేజీలు, హోం స్టే వంటివి ఏర్పాటు చేయించాలన్నది యోచన. ఇటీవల ఓ ప్రైవేటు వ్యక్తి కాటేజీలు ఏర్పాటు చేశాడని, ఈ తరహా స్థానికుల నుంచి మరిన్ని రావాలన్నదే లక్ష్యమని అటవీశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తమ ఇళ్లనే స్థానికులు వసతిగృహాలుగా మార్చడంతో పాటు అటవీశాఖతో కలిసి అటవీ అందాలు చూపించడం ద్వారా ఆదాయాన్ని పొందొచ్చని అధికారులు చెబుతున్నారు.
స్థానికులకు ఉపాధి పెరుగుతుంది
- రోహిత్ గొప్పిడి, ఎఫ్డీఓ-అమ్రాబాద్
నల్లమలలో ప్రకృతి పర్యాటకాన్ని పెంచడంపై దృష్టి పెట్టాం. పచ్చటి పల్లెటూరిలో ఉన్నామన్న ప్రత్యేక అనుభూతి కలిగించేందుకు మట్టి గృహా(మడ్ హౌస్)ల్లో బస చేసేలా, వీటిని నిర్మించే ఆలోచన ఉంది. అమ్రాబాద్లో ప్రకృతి పర్యాటకాన్ని పెంచితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వారికి ఉండే ఖాళీ భూమిని పర్యాటకులకు వసతి తదితర ఏర్పాట్లకు ఉపయోగించడం ద్వారా వారికి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM