నేడు బాసరకు తమిళిసై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై  ఆదివారం బాసరలోని ట్రిపుల్‌ ఐటీని సందర్శించనున్నారు. శనివారం అర్ధరాత్రి ఆమె కాచిగూడ నుంచి రైలులో  నిజామాబాద్‌కు పయనమయ్యారు. అక్కడి నుంచి ఆమె బాసరకు వెళతారు. ట్రిపుల్‌ ఐటీ

Updated : 07 Aug 2022 05:47 IST

ట్రిపుల్‌ఐటీ సందర్శన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై  ఆదివారం బాసరలోని ట్రిపుల్‌ ఐటీని సందర్శించనున్నారు. శనివారం అర్ధరాత్రి ఆమె కాచిగూడ నుంచి రైలులో  నిజామాబాద్‌కు పయనమయ్యారు. అక్కడి నుంచి ఆమె బాసరకు వెళతారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో అల్పాహారం చేసి, వారితో, అధికారులతో సమావేశమవుతారు. అక్కడి సమస్యల పరిష్కారంపై చర్చిస్తారు. అనంతరం ఆమె నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం సందర్శిస్తారు.

అల్లం నారాయణ పదవీ కాలం పెంపు

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని