PM Modi: ఆ మూడింటితో స్వావలంబన
ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ (సాంకేతికత) అనే మూడు ‘టి’లను ప్రోత్సహించడంపై రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దిగుమతులను తగ్గించుకుని, ఎగుమతులను పెంచేందుకు ఇది
వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికతలపై రాష్ట్రాలు దృష్టి సారించాలి
ఆధునికీకరణ ద్వారా వ్యవసాయంలో స్వయం సమృద్ధి
పట్టణీకరణ.. బలహీనత కాదు బలమే
ఈ భేటీలో నాటిన విత్తనాలు 2047లో భారత్ అందుకునే ఫలాలు
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన
ఈనాడు, దిల్లీ: ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ (సాంకేతికత) అనే మూడు ‘టి’లను ప్రోత్సహించడంపై రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దిగుమతులను తగ్గించుకుని, ఎగుమతులను పెంచేందుకు ఇది అవసరమని చెప్పారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి ఏడో సమావేశంలో ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సాంకేతికతను వినియోగించుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడం ద్వారా స్వయంసమృద్ధి సాధించి, ప్రపంచానికి నేతగా మన దేశం అవతరించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంతో పాటు పశు సంవర్ధక, ఆహారశుద్ధి పరిశ్రమ రంగాలనూ ఆధునికీకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీలైన చోట్ల స్థానిక వస్తువులనే వాడాలని, ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం కేవలం ఒక రాజకీయ పార్టీది కాదని, అది అందరి ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. శీఘ్రగతిన సాగుతున్న పట్టణీకరణను బలహీనతగా కాకుండా మన దేశ బలంగా మలచుకోవాలని చెప్పారు.
‘‘ఈ సమావేశంలో చర్చించిన అంశాలు వచ్చే 25 ఏళ్లకు దేశ ప్రాధాన్యాలను నిర్దేశిస్తాయి. ఈరోజు నాటే విత్తనాలు 2047లో భారత్ అందుకొనే ఫలాలను నిర్వచిస్తాయి’’ అని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాతే జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని, అమలుకు స్పష్టమైన సమయంతో మార్గసూచీ తయారు చేయాలని సూచించారు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే కొవిడ్ మహమ్మారి నుంచి మన దేశం బయటపడగలిగిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు భారత్ను ‘ప్రపంచ నేత’గా చూసే పరిస్థితి వచ్చిందన్నారు.
జి-20 కోసం ప్రత్యేక బృందాలు
2023లో జి-20 సదస్సుకు మన దేశం నాయకత్వం వహించబోతున్న విషయాన్ని ప్రధాని ఈ సమావేశంలో ప్రస్తావించారు. భారత్ అంటే దిల్లీ ఒక్కటే కాదు.. విభిన్న రాష్ట్రాల సమాహారం అని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదో అరుదైన అవకాశమని పేర్కొన్నారు. జి-20 చుట్టూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని, దేశంలో అత్యుత్తమ ప్రతిభావంతులను గుర్తించడానికి దీన్నో అవకాశంగా మలుచుకోవాలని కోరారు. గరిష్ఠస్థాయిలో ప్రయోజనం పొందేందుకు ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా జి-20 బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమ ప్రాధాన్యాలు, సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రత్యక్షంగా జరిగిన ఈ తొలి సమావేశానికి 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ముఖ్యమంత్రులు- కేసీఆర్, ఎంకే స్టాలిన్, నీతీశ్కుమార్, అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాలేదు. పప్పుధాన్యాలు, నూనెగింజల విషయంలో కనీస మద్దతు ధర విధానాన్ని మరింత ప్రభావవంతంగా మలచాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. నిర్ణయాలను తమపై బలవంతంగా రుద్దవద్దని భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల సీఎంలు విజ్ఞప్తి చేశారు.
నిజాయతీ గల మధ్యవర్తిలా పనిచేస్తాం: నీతి ఆయోగ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి నీతి ఆయోగ్ నిజాయతీ గల మధ్యవర్తిలా పనిచేస్తుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్బేరి, సీఈఓ పరమేశ్వరన్, సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో నీతి ఆయోగ్ అంబుడ్స్మన్లా వ్యవహరించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేసిన డిమాండ్ గురించి విలేకర్లు అడిగినప్పుడు వారు ఈ విధంగా స్పందించారు. ‘‘నీతి ఆయోగ్ ముఖ్య ఉద్దేశం సహకారపూర్వక, పోటీతత్వ సమాఖ్య వ్యవస్థను ప్రోత్సహించడమే. నీతి ఆయోగ్ను రాష్ట్రాలు తమ స్నేహితుడిగా చూస్తున్నాయని భావిస్తున్నాం. మేం వారధిలా పనిచేస్తాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.