Hyderabad: పేరుకే ఉన్నట్టు.. అంతా కనికట్టు!
గచ్చిబౌలి చుట్టుపక్కల కొన్నాళ్లుగా ‘వాణిజ్య ప్రీలాంచ్ దందా’కు తెరలేచింది. ఎంతో డిమాండ్ ఉండే ఇలాంటి ప్రాంతంలోనే చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయలేక ఒక పెద్ద సంస్థ చేతులెత్తేసింది. రాయదుర్గంలో ఒక వాణిజ్య భవనంలో ఎంతో ముందుగానే
వాణిజ్య నిర్మాణాల పేరిటా ‘ప్రీలాంచ్ దందా’
పెట్టుబడి పెడితే ప్రతినెలా అద్దె అంటూ దగాపూరిత ప్రచారం
ఏజెంట్ల ద్వారా కొనుగోలుదారులకు వల.. రూ.కోట్లలో వసూళ్లు
ఈనాడు - హైదరాబాద్
గచ్చిబౌలి చుట్టుపక్కల కొన్నాళ్లుగా ‘వాణిజ్య ప్రీలాంచ్ దందా’కు తెరలేచింది. ఎంతో డిమాండ్ ఉండే ఇలాంటి ప్రాంతంలోనే చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయలేక ఒక పెద్ద సంస్థ చేతులెత్తేసింది. రాయదుర్గంలో ఒక వాణిజ్య భవనంలో ఎంతో ముందుగానే అడ్వాన్స్లు చెల్లించి రెండు అంతస్తులు కొంటే.. పూర్తిచేసి ఇవ్వడంలో జాప్యంతో కొనుగోలుదారులు నష్టపోయారు. నిర్మాణదారు జైలుకెళ్లడంతో అందులో కొన్నవారు తీవ్రంగా దెబ్బతిన్నారు.
ఆ సంస్థల పేరిట గజం భూమి అయినా ఉండదు.. చేతిలో రూపాయి కూడా కనిపించదు. కానీ, వాణిజ్య భవనాలంటూ ‘ప్రీలాంచ్ విక్రయాల’ పేరిట గాలిలో అద్భుతమైన మేడలు కడతున్నాయి. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లు ముద్రించి రకరకాల మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. నెలనెలా రూ.వేలల్లో కిరాయి చెల్లిస్తామంటూ ఇటీవల కొన్ని సంస్థలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. ఈ వలకు చిక్కుతున్న అమాయకులు ఎప్పుడో కడతామనే నిర్మాణానికి ఇప్పుడే రూ.లక్షలు చెల్లించి, లబోదిబో అంటున్నారు. ఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీలాంచ్ విక్రయాల పేరిట జరిగిన దందాలో మోసపోయామని కొనుగోలుదారులు ఓ పక్క పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సొమ్ము వెనక్కివ్వాలని ఆయా సంస్థల ముందు ధర్నాలు చేస్తున్నారు.. ఇంకోపక్క మరికొన్ని సంస్థలు మాల్స్లో ‘కమర్షియల్ స్పేస్’ అంటూ యథేచ్ఛగా దందాకు తెర తీశాయి. సెంటు భూమి అయినా లేకుండానే రూ.కోట్లు కొల్లగొట్టేలా పక్కా వ్యూహం పన్నాయి. ‘ఆకర్షణీయ వడ్డీ’ పేరుతో దగా చేస్తున్నాయి. వీటి ప్రచార సరళి, విచ్చలవిడి వ్యాపార సంస్కృతిపై నిర్మాణ సంస్థలు ఫిర్యాదులు చేస్తున్నా.. కట్టడి చేయాల్సిన రియల్ ఎస్టేట్ నియంత్రణ అథారిటీ(రెరా) స్తబ్దంగా ఉండిపోవడంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు.
భూమి లేకుండానే..
* నగరానికి చెందిన ఒక సంస్థ విమానాశ్రయానికి చేరువలో ప్రపంచస్థాయి షాపింగ్ మాల్ నిర్మిస్తున్నామని.. ఇందులో పెట్టుబడి పెడితే మంచి రాబడి అందుకుంటారని ప్రచారం చేస్తోంది. రెండు టవర్లలో 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్ వస్తుందని.. ఇందులో వాణిజ్య స్థలం ఒక యూనిట్ అంటే 120 చ.అ. విస్తీర్ణాన్ని రూ.10లక్షలకు కొంటే.. కొన్నప్పటి నుంచి నిర్మాణం పూర్తయ్యేవరకు ప్రతినెలా రూ.5వేలు ఇస్తామంటోది. నిర్మాణం పూర్తయ్యాక రూ.18వేలు అద్దె రాబడి వస్తుందని నమ్మించే యత్నం చేస్తోంది. సంస్థ మోసపూరిత ప్రకటనపై ఫిర్యాదులు వస్తుండటంతో ప్రాజెక్టు గురించి ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. వీరు మాల్ కడతామని చెబుతున్న ప్రాంతంలో అసలు వీరి పేరున సెంటు భూమి కూడా లేదని తేలింది. కొంటామని భూయాజమానులతో మాట్లాడారంతే.. కానీ, అప్పుడే మాల్ ఎలా గొప్పగా ఉండబోతుందో గ్రాఫిక్స్ డిజైన్ చేసి.. ఏజెంట్లను నియమించుకుని కొనుగోలుదారులతో సొమ్ములు కట్టించుకుంటున్నారు. భూమి కొనేందుకే సొమ్ములు లేని సంస్థ, రెరా నిబంధనలకు విరుద్ధంగా ప్రీలాంచింగ్ చేస్తూ వేలమందికి ప్రతినెలా సొమ్ములు ఎలా చెల్లిస్తుందో కొనుగోలుదారులు ఆలోచించాలని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు హితవు పలుకుతున్నారు.
* విమానాశ్రయానికి చేరువలోనే మరో సంస్థ సైతం అతిపెద్ద మాల్ రాబోతుందని.. అనుమతులు లేకుండా వాణిజ్య స్థలాలను ప్రీలాంచ్లో విక్రయిస్తోంది. కట్టడి చేయాల్సిన సంస్థలు చోద్యం చూస్తున్నాయి.
* వాణిజ్య స్థలమైనా, నివాస గృహమైనా నిబంధనల మేరకు నడుచుకునే సంస్థల్లో కొనడం ద్వారా పెట్టిన పెట్టుబడికి రక్షణ ఉంటుంది. అన్ని అనుమతులు లభించి, రెరాలో నమోదైతే కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో 70శాతం వరకు ఎస్క్రో ఖాతాలో జమ చేస్తారు. పైగా అనుమతులు వచ్చాయంటే అప్పటికే వారి వద్ద భూమి, స్పష్టమైన ప్లాన్ ఉంటుంది. అదే ప్రీలాంచ్లో కల్లబొల్లి కబుర్లు చెప్తారు.. కాగితాలపైనే మేడలు కడతారు. వీరి చేతిలో భూమి, నిర్మాణానికి సొమ్ములు ఏమీ ఉండవు. అంతా కొనుగోలుదారుల నుంచే రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇటీవల జూబ్లీహిల్స్లో వెలుగుచూసిన ఒక ఇన్ఫ్రా సంస్థ ఉదంతమే ఇందుకు నిదర్శం.
చెట్టే లేకుండా కాయలెలా?
-పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్ హైదరాబాద్
భూమి, అనుమతులు లేకుండా, రెరాలో రిజిస్టర్ కాని వెంచర్లలో కొని మోసపోవద్దు.. అంటూ క్రెడాయ్ తరఫున కొనుగోలుదారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. అత్యాశకు పోయి వారు ఇరకాటంలో పడుతున్నారు. భూమే లేని సంస్థ ప్రతినెలా అద్దె ఎక్కడి నుంచి చెల్లిస్తుంది? నిర్మాణం పూర్తయితే కదా కిరాయిలు వచ్చేది. మొక్క నాటి, పెరిగి కాయలు కాస్తే కోసుకోగలం. అసలు మొక్కే నాటలేదు.. కాయలు కోసి ఇస్తాను అంటే ఎలా సాధ్యం? దీనిపై కొనుగోలుదారులు ఆలోచించాలి. రెరా ఉన్నా పూర్తిస్థాయి ఛైర్మన్ లేక మన రాష్ట్రంలో చురుగ్గా పనిచేయడం లేదు. ఇక ముందైనా ఇలాంటి దందాలు జరగకుండా ప్రభుత్వం మేల్కొనాలి. గట్టి చర్యలు చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే