పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు తుది విడత వెబ్‌ కౌన్సెలింగ్‌

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో 2022-23 విద్యా సంవత్సరానికి తుది విడత ప్రత్యేక రౌండ్‌ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ పాలీసెట్‌-2022 ప్రవేశ పరీక్షలో అర్హత

Published : 08 Aug 2022 04:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో 2022-23 విద్యా సంవత్సరానికి తుది విడత ప్రత్యేక రౌండ్‌ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ పాలీసెట్‌-2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. వచ్చే నెల ఒకటి నుంచి మూడు వరకు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, రెండో తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. రాష్ట్రంలో 118 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు కళాశాలలు ఉండగా వాటిలో 28,562 సీట్లకు గానూ 7,853 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల భర్తీ తదితర అంశాలకు సంబంధించి https://tspolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని