Engineering: ‘మేనేజ్మెంట్’ దోపిడీ
ఇంజినీరింగ్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరిట దోపిడీ మొదలైంది. ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల కావడంతో ఈ కోటా సీట్లను ముందుగానే భర్తీ చేసుకునేందుకు సకల యత్నాలూ చేస్తున్నాయి. మార్కులు కాస్త తక్కువగా
ఆ కోటా సీట్ల భర్తీకి భారీగా వసూలు
కంప్యూటర్ సైన్స్కు ఏకంగా రూ.8-15 లక్షలు
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల ఇష్టారాజ్యం
* హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి కుమార్తె ఎంసెట్ ‘కీ’ని చూసుకోగా.. 45 మార్కులొచ్చాయి. ఆ మార్కులకు మంచి ర్యాంకు రావడం కష్టమే. నగర శివారులోని ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న ఓ కళాశాలను సంప్రదిస్తే.. కంప్యూటర్ సైన్స్ సీటు కావాలంటే నాలుగేళ్లకు రూ.6.80 లక్షలు ఫీజు, అదనంగా డొనేషన్ రూపంలో మరో రూ.7 లక్షలు చెల్లించాలని, సీటు బుకింగ్కు ముందస్తుగా రూ.25 వేలు చెల్లించాలని షరతు విధించారు.
* ఎంసెట్లో ఎంత తక్కువ ర్యాంకు వచ్చినా రూ.10 లక్షలిస్తే చాలు.. మేనేజ్మెంట్ కోటా కింద సీటు ఇస్తామని ఘట్కేసర్ సమీపంలోని మరో కళాశాల యాజమాన్యం చెబుతోంది.
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరిట దోపిడీ మొదలైంది. ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల కావడంతో ఈ కోటా సీట్లను ముందుగానే భర్తీ చేసుకునేందుకు సకల యత్నాలూ చేస్తున్నాయి. మార్కులు కాస్త తక్కువగా వచ్చి.. మంచి ర్యాంకులు రావని భావిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. వారి పరిస్థితిని తమకు అనుకూలంగా ‘సొమ్ము’ చేసుకునే పనిలో కళాశాలలు ఉన్నాయి.
ప్యాకేజీగా మాట్లాడుకుని..: ఇంజినీరింగ్ విద్య నాలుగేళ్లకు కలుపుకొని కళాశాలలు ప్యాకేజీ మాట్లాడుకుంటున్నాయి. కంప్యూటర్ సైన్స్ విభాగానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనికి తగ్గట్టుగా సీట్లు పెంచుకుని ‘వసూళ్లు’ చేస్తున్నాయి. నగర శివారులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా కంప్యూటర్ సైన్స్ సీటు రూ.12-15 లక్షల మధ్య పలుకుతోంది. అందులోనూ సిఫార్సు ఉంటేనే తీసుకుంటున్నారు. కొన్ని కళాశాలలు రూ.8-10 లక్షల మధ్య వసూలు చేస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ అనుబంధ విభాగాల్లో కళాశాలను బట్టి సీట్లు రూ.6-10 లక్షలు పలుకుతున్నాయి. కొన్ని ప్రముఖ కళాశాలల్లో ఎలక్ట్రికల్, మెకానికల్లోనూ డిమాండ్ కనిపిస్తోంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్లకు ‘ఏ’ కేటగిరీలోని ఫీజుల విధానమే వర్తిస్తుంది. అధికారికంగా ఉన్న ఫీజులను రెగ్యులర్గా కట్టించుకుంటూ.. మిగిలిన మొత్తాన్ని డొనేషన్ల రూపంలో వసూలు చేస్తున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లలో 15 శాతం వరకు ఎన్నారై స్పాన్సర్డ్ కేటగిరీలోకి మార్చుకునే వీలుంది. ఈ కోటాలో అధికారికంగా 5వేల యూఎస్ డాలర్లు ఫీజు ఉంటుంది. అలా మార్పిడి చేసి భారీగా వసూలు చేస్తున్నారు.
ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలన్న డిమాండ్ ఉన్నా..: మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి, ఫీజుల నియంత్రణ కమిటీ(ఎఫ్ఆర్సీ) పర్యవేక్షణ లోపంతో కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. వాస్తవానికి 2005 వరకు కన్వీనర్ కోటాలో ఉచిత, చెల్లింపు సీట్లుండేవి. మేనేజ్మెంట్ పరిధిలో అయిదు శాతమే కేటాయించేవారు. యాజమాన్యాల ఒత్తిళ్లకు ప్రభుత్వాలు తలొగ్గి ఈ కోటా సీట్లను 30 శాతానికి పెంచాయి. వీటికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేయాలని కొన్నేళ్లుగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా.. ఫలితం లేదు. ‘‘మేనేజ్మెంట్ కోటా సీట్లపై ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలి. విద్యార్థులెవరెవరు దరఖాస్తు చేశారు.. ఏ విధంగా సీట్లు కేటాయించారనే విషయాలు బహిర్గతం చేయాలి. ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించాలి’’ అని తెలంగాణ సాంకేతిక, వృత్తివిద్యాసంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వి.బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.\
ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే..
ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు రెండు రకాలుగా ఉంటాయి. ‘ఏ’ కేటగిరీలో 70 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం ‘బీ’ కేటగిరీ సీట్లను మేనేజ్మెంట్ కోటాలో నింపుకోవచ్చు. సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే కళాశాలలు బ్రాంచ్ల వారీగా ఖాళీలు ప్రకటించి భర్తీ చేయాల్సి ఉంటుంది. తొలుత జేఈఈ-మెయిన్ ర్యాంకర్లకు ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకర్లను తీసుకోవాలి. అప్పటికీ సీట్లు మిగిలితే ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునే వీలుంటుంది. నగర శివారులోని కొన్ని కళాశాలలు మినహా మిగిలినవన్నీ ఎవరు ఎక్కువ డబ్బు చెల్లిస్తే వారికే సీట్లన్నట్లుగా బేరమాడుతున్నాయని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్