అశ్వాపురం యువకుడి ప్రతిభ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని గౌతమీనగర్‌కు చెందిన అభిరాంరెడ్డి (30) అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్‌లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు. గౌతమీనగర్‌లోని అణుశక్తి కేంద్ర పాఠశాలలో పదో తŸరగతి వరకు చదివిన

Updated : 09 Aug 2022 05:41 IST

ఇంటెల్‌లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో కొలువు

అశ్వాపురం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని గౌతమీనగర్‌కు చెందిన అభిరాంరెడ్డి (30) అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్‌లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు. గౌతమీనగర్‌లోని అణుశక్తి కేంద్ర పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఈ యువకుడు  ‘యూనివర్సిటీ ఆఫ్‌ మెసాచుసెట్స్‌’లో పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశాడు. మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో పోస్ట్‌ డాక్టరేట్‌ పూర్తిచేసి ఈ నెలలో అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్‌ కంపెనీలో రీసెర్చ్‌ సైంటిస్టుగా రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం దక్కించుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని