యాదాద్రిలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

యాదాద్రీశుల దివ్యాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. అష్టభుజి ప్రాకార మండపంలో ఏర్పాటైన యాగశాలలో సోమవారం ప్రత్యేక జప హోమం నిర్వహించారు. ఆలయ నిత్య కైంకర్యాల

Published : 09 Aug 2022 04:09 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రీశుల దివ్యాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. అష్టభుజి ప్రాకార మండపంలో ఏర్పాటైన యాగశాలలో సోమవారం ప్రత్యేక జప హోమం నిర్వహించారు. ఆలయ నిత్య కైంకర్యాల నిర్వహణలో చోటు చేసుకున్న పొరపాట్ల నివారణకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం వైష్ణవ సంప్రదాయమని ఆలయ ప్రధాన పూజారి నరసింహాచార్య తెలిపారు. చతుస్థానార్చన, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. ప్రత్యేక ఆరాధనలతో ఈ క్షేత్ర మూలవరులను కొలిచారు. మంత్ర పఠనాలు, హోమం మధ్య రూపొందించిన పవిత్ర మాలలను మహావిష్ణువు ప్రధాన ఆయుధమైన శ్రీసుదర్శన ఆళ్వారుడికి ధరింపజేశారు. ఈ వేడుకలతోపాటు ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పాలతో ఆరాధన, శ్రావణ లక్ష్మీదేవి కోటి కుంకుమార్చన నిర్వహించారు. ఈ పర్వాలలో ఆలయ ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం పవిత్రమాలలను ఆలయ  విమానానికి అలంకరించారు. శ్రీసుదర్శన చక్రమాలలు ధరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని