KCR: రేపు మంత్రిమండలి సమావేశం
రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్లో నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి రుణపరిమితిలో కేంద్రం కోత, బాండ్ల విక్రయంపై ఆంక్షలు తదితర అంశాలతో పాటు మునుగోడు
ధాన్యం.. మునుగోడుపై చర్చ
కొత్త పింఛన్లు, రేషన్కార్డులపై నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్లో నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి రుణపరిమితిలో కేంద్రం కోత, బాండ్ల విక్రయంపై ఆంక్షలు తదితర అంశాలతో పాటు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ రుణాలపై కేంద్రం కొర్రీల నేపథ్యంలో ఇటీవల సీఎస్ సోమేశ్కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్కుమార్, సునీల్శర్మలతో కలిసి దిల్లీ వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర అధికారులు కేంద్ర అధికారులను కలిసి రుణ ఆంక్షలపై అభ్యంతరాలు తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ రుణ ఆంక్షలను సడలించి మరో రూ.10 వేల కోట్ల రుణానికి అనుమతించింది. మరో రూ.15 వేల కోట్ల రుణంపై కేంద్ర మంత్రిత్వ శాఖలను ఉన్నతాధికారులు కోరినా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరులపై కేసీఆర్ దృష్టి సారించారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ను ఎఫ్సీఐ నిలిపివేయడంతో ప్రభుత్వ గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయి. వర్షాలకు తడుస్తూ మట్టిపాలవుతున్నాయి. ఈ క్రమంలో ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించేందుకు మంత్రిమండలి అనుమతించనుంది.
రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, కొత్త రేషన్కార్డుల జారీపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అనాథపిల్లల సంక్షేమానికి మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల పలు సిఫార్సులు చేసింది. వారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, అనాథాశ్రమాల నిర్వహణతో పాటు వారి కోసం పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. వీటన్నింటికీ మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశం, 75 మంది ఖైదీల విడుదల, ఇతర నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు స్థానానికి ఉపఎన్నికపై రాజకీయపరమైన అంశాల కింద మంత్రిమండలిలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. పాలనపరమైన అంశాలపైనా చర్చ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. -
అనారోగ్య క్లెయిమ్ పరిమితి రూ.లక్షకు పెంపు: ఈపీఎఫ్ఓ
ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్సు క్లెయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఈపీఎఫ్వో పెంచింది. -
ఉపాధి హామీకి కూలీలను పెంచాలి
రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
రాజ్భవన్లో సీతారామ కల్యాణం
రాజ్భవన్లోని కమ్యూనిటీ హాలులో బుధవారం సీతారామ కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సతీమణి సుమతి రాధాకృష్ణన్తో కలిసి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
చెరువుల కబ్జాలతో ముప్పే
చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
నల్గొండ, ఖమ్మం గరంగరం
ఖమ్మం నగరం నిప్పుల కుంపటిలా మారింది. ఇక్కడ మంగళ, బుధవారాల్లో వడగాలులు వీచాయి. బుధవారం సాధారణం కన్నా ఏకంగా 6 డిగ్రీలు పెరిగి 43.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
సంక్షిప్త వార్తలు
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!