పీహెచ్‌డీ పూర్తికి ఆరేళ్లే గడువు

యూజీసీ నియమావళి-2018 ప్రకారం పీహెచ్‌డీ పూర్తికి ఆరేళ్లే గరిష్ఠ గడువని, దాన్ని పాటించాలని రాష్ట్రంలోని వర్సిటీల ఉపకులపతులకు రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశ పరీక్షకు

Published : 10 Aug 2022 04:49 IST

 పాటించాలంటూ వీసీలకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: యూజీసీ నియమావళి-2018 ప్రకారం పీహెచ్‌డీ పూర్తికి ఆరేళ్లే గరిష్ఠ గడువని, దాన్ని పాటించాలని రాష్ట్రంలోని వర్సిటీల ఉపకులపతులకు రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశ పరీక్షకు 70 శాతం, ముఖాముఖి/వైవాకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి విద్యార్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఆచార్యుడు, సహ ఆచార్యుడు, సహాయ ఆచార్యుల వద్ద వరసగా 8, 6, 4కు మించి పీహెచ్‌డీ విద్యార్థులను తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని