గిరిజనులకు రిజర్వేషన్‌ పెంచని తెరాస ప్రభుత్వం : తెదేపా

గిరిజనులకు రిజర్వేషన్‌ పెంచుతామంటూ అధికారంలోకి వచ్చిన తెరాస ఆ హామీ అమలుచేయలేదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా నాయక్‌ ఆరోపించారు. మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆదివాసీ దినోత్సవాన్ని తెదేపా నిర్వహించింది.

Updated : 10 Aug 2022 06:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజనులకు రిజర్వేషన్‌ పెంచుతామంటూ అధికారంలోకి వచ్చిన తెరాస ఆ హామీ అమలుచేయలేదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా నాయక్‌ ఆరోపించారు. మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆదివాసీ దినోత్సవాన్ని తెదేపా నిర్వహించింది. దీనికి ఈ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గోపీ అధ్యక్షత వహించారు. తెదేపా పాలనలోనే మారుమూల గిరిజన తండాల్లో అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని