ఇటుకా ఇటుకా పేర్చి ఇల్లు సమకూర్చి!
పల్లె చిన్నబోతోంది.. పట్నం కిటకిటలాడిపోతోంది.. గ్రామాల నుంచి జనం పొట్టచేతపట్టుకుని వలస పోతుంటే పట్టణాలు వారందరికీ కనీసావసరాలు చూపలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. 75 ఏళ్ల స్వతంత్ర భారత జనసాంద్రతలో వచ్చిన కీలకమార్పు ఇది.
వేగంగా విస్తరిస్తున్న గృహ నిర్మాణరంగం
‘అందరికీ ఇల్ల్లు’ లక్ష్యం దేశానికి సవాలే
పల్లె చిన్నబోతోంది.. పట్నం కిటకిటలాడిపోతోంది.. గ్రామాల నుంచి జనం పొట్టచేతపట్టుకుని వలస పోతుంటే పట్టణాలు వారందరికీ కనీసావసరాలు చూపలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. 75 ఏళ్ల స్వతంత్ర భారత జనసాంద్రతలో వచ్చిన కీలకమార్పు ఇది.
* స్వాతంత్య్రానికి పూర్వం సుమారు 90 శాతం ప్రజలు పల్లెల్లోనే ఉండేవారు. 1901 నాటి జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లో నివసించే వారు 11.5 శాతం మంది మాత్రమే. జనాభా పెరిగి.. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పేదలు పట్నం బాట పట్టారు. అలా క్రమేణా పెరిగిపోయిన పట్టణాల జనాభా 2021 నాటికి 35 శాతానికి ఎగబాకింది.
* పూర్వం తక్కువ జనాభా ఉండటంతో ఇళ్ల సమస్య పెద్దగా లేదు. కాలక్రమంలో జనాభా పెరగడంతో గృహాల సమస్య తలెత్తింది. ఇప్పటికీ అత్యధికంగా సొంతిళ్లు ఉన్నది గ్రామీణులకే. పట్టణాలు, నగరాల్లో ఆ భాగ్యం కొందరికే దక్కింది. మిగిలిన వారందరికీ అద్దె ఇళ్లే దిక్కు.
* ప్రస్తుత డిమాండ్ మేరకు ఏటా ప్రతి వెయ్యి మంది జనాభాకు అయిదు ఇళ్ల చొప్పున నిర్మించాలి. ప్రస్తుతం మూడే నిర్మిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే కోటి ఇళ్లకు కొరత ఏర్పడింది. 2030 నాటికి ఈ లోటు 2.25 కోట్లకు చేరవచ్చని అంచనా.
... ఈ గణాంకాలు మన దేశంలోని గృహ నిర్మాణ రంగం పురోగతిని, భవిష్యత్తు లక్ష్యాలను చాటుతున్నాయి.
స్వాతంత్య్రం... మనకు సంతోషంతోపాటు ఎన్నో సవాళ్లనూ మోసుకొచ్చింది. నాడు కడు పేదరికంతో అల్లాడుతున్న ప్రజలకు కూడు, గూడు, గుడ్డ కల్పించే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేశాయి. ‘ప్రతి ఒక్కరికీ సొంతిల్లు’ లక్ష్యంగా గత 75 ఏళ్లలో అనేక అడుగులు పడ్డాయి. ఎన్నెన్నో పథకాలు, విధానాలు, సంస్కరణలు అమలయ్యాయి. ప్రతిబంధకాలను అధిగమిస్తూ ఈ ఏడున్నర దశాబ్దాల్లో గృహనిర్మాణ రంగంలో దేశం గణనీయంగా పురోగమించింది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో గృహ నిర్మాణ రంగం ఎదిగిన తీరుతెన్ను, రానున్న 25 ఏళ్లలో అధిరోహించాల్సిన సోపానాలపై ప్రత్యేక కథనం.
గూడు కట్టిన పథకాలు
స్వాతంత్య్రం వచ్చాక ఆహార సమస్యకు ప్రథమ ప్రాధాన్యమిచ్చారు. దేశ విభజన అనంతరం అధిక సంఖ్యలో శరణార్థుల రాకతో ఇళ్ల కొరత ఏర్పడింది. దీంతో 1950లో కార్మికులు, బలహీనవర్గాల కోసం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం అల్పాదాయ వర్గాలకు గృహ నిర్మాణ పథకం (1954), మురికివాడల అభివృద్ధి పథకం (1956), మధ్య ఆదాయ వర్గాలకు గృహనిర్మాణ పథకం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దె ఇళ్ల పథకం, గ్రామీణ గృహ నిర్మాణ ప్రాజెక్టు (1959), ఇందిరా ఆవాస్ యోజన (1985), వాల్మీకి అంబేడ]్కర్ ఆవాస్ యోజన (1998), జేఎన్ఎన్యూఆర్ఎం (2005), రాజీవ్ ఆవాస్ యోజన (2013), ప్రధానమంత్రి ఆవాస్ యోజన (2015) వంటివి అమలయ్యాయి.
* కేంద్ర ప్రభుత్వం 1988 తర్వాత తీసుకొచ్చిన కొన్ని విధానాలు గృహ నిర్మాణానికి ఊతమిచ్చాయి. 1988లో తొలిసారిగా జాతీయ గృహకల్పన విధానాన్ని కేంద్రం ప్రకటించింది. తర్వాత 1994లో దాన్ని సవరించారు. 1998లో నివాస, గృహకల్పన విధానాన్ని ఖరారు చేశారు. పట్టణ భూ పరిమితి, నియంత్రణ చట్టాన్ని (యూఎల్సీఆర్ఏ) రద్దు చేశారు. స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులకు అవకాశమిచ్చారు.
* 2007లో జాతీయ, పట్టణ గృహ, నివాస విధానాన్ని (ఎన్యూహెచ్హెచ్పీ) ప్రకటించారు. అందుబాటు ధరల్లో ‘అందరికీ ఇల్లు’ అనే లక్ష్య సాధన దిశగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఈ విధానం ప్రోత్సహించింది.
సొంతింటికి సహకారం
* ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం గృహ నిర్మాణ సహకార సంస్థల్ని ఏర్పాటు చేసింది. 1969-70 మధ్య 16,308 ప్రాథమిక గృహ నిర్మాణ సహకార సంఘాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య పది లక్షలు దాటింది.
* 1970లో కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ఏర్పాటు చేసింది. 1977లో హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుతో గృహ నిర్మాణానికి ప్రైవేటు రంగంలో రుణాలు ఇవ్వటం మొదలైంది. 1988లో నేషనల్ హౌసింగ్ బ్యాంకును గృహ రుణాల కోసం ఏర్పాటు చేశారు. వీటితో అధికాదాయ (హెచ్ఐజీ), మధ్య ఆదాయ (ఎంఐజీ) వర్గాలు లబ్ధి పొందాయి.
గతి మార్చిన ఆర్థిక సంస్కరణలు
ఆర్థిక సంస్కరణలు (1991) అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు, ఆదాయాలు భారీగా పెరగటం, వాటి ఆధారంగా అనుబంధ వ్యాపారాలు వృద్ధి చెందటంతో నగరాలు, పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంది. ప్రధానంగా ఐటీ రంగం వృద్ధి... ప్రైవేటు రంగంలో గృహ నిర్మాణం శరవేగంగా పెరగటానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి రుణాలిచ్చే ప్రైవేటు సంస్థలు పుట్టుకొచ్చాయి. రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపులు, సులభ వాయిదాల్లో చెల్లింపు వంటి అవకాశాలు.. సొంతిల్లు సమకూర్చుకునే వారి సంఖ్య పెరగటానికి దోహదపడ్డాయి.
స్వాతంత్య్ర శతాబ్ది (2047) నాటికి ‘అందరికీ ఇల్లు’ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో నిపుణులు ఇచ్చిన సూచనలు ఇవీ..
* ఇప్పటికే పల్లెల్లోని ప్రతి 10 మందిలో ఒకరు, పట్టణాల్లోని ప్రతి ఆరుగురిలో ఒకరు సరైన సౌకర్యాలు లేని ఇళ్లలో నివాసం ఉంటున్నారు. దేశంలోని పట్టణాల జనాభా 2050 నాటికి 81.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా. పెరిగే జనాభాకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం, పేదలకు మౌలిక సదుపాయాల కల్పన సవాల్ కానుంది. గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాలను మరింత సరళతరం చేసి.. అంతిమంగా ప్రజలు సొంత ఇంట్లో నివసించేందుకు అనువైనచర్యలు తీసుకోవాలి.
* భూముల ధర అధికంగా ఉండటం, వాటి లభ్యత తక్కువగా ఉండటం, నిర్మాణ వ్యయం పెరగటం, పేదలకు గృహ రుణాలు అందుబాటులో లేకపోవడం వంటివి సమస్యలు కానున్నాయి. వీటిని అధిగమించాలి.
* తక్కువ వ్యయంతో నాణ్యమైన నిర్మాణాలు అందుబాటులోకి రావాలి. గృహనిర్మాణ సామగ్రిపై పన్నుల భారం తగ్గించాలి.
* పేదలు, అల్పాదాయ వర్గాలకు గృహ నిర్మాణాల కోసం వడ్డీ లేని రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలి.
* ఇళ్లు కట్టుకోడానికి ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉండేలా సహకారాన్ని పెంపొందించాలి. రుణాల మంజూరును విస్తృతం చేయాలి. ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న మినహాయింపులనూ పెంచాలి.
* ఇంజినీర్లు అందుబాటులో ఉన్నా మేస్త్రీల కొరత ఎక్కువగా ఉంది. క్షేత్రస్థాయిలో పని చేసే వారు తక్కువగా ఉన్నారు. ఉన్న వారిలోనూ సాంకేతిక నైపుణ్యం పెరగాల్సి ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. నిర్మాణరంగానికి అవసరమైన కార్మికుల శిక్షణ కోసం ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను పెంచి.. తదనుగుణమైన కోర్సులు ప్రవేశపెట్టాలి.
269 అనుబంధ పరిశ్రమలకు ఊతం
గృహ నిర్మాణ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటు అందిస్తోంది. దీని ఆధారంగా 269 రకాల అనుబంధ పరిశ్రమలు నడుస్తున్నాయి. తద్వారా ఉద్యోగిత పెరుగుతుంది. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగితను చూపుతున్నది గృహ నిర్మాణ రంగమే. విదేశీ నిధులు అత్యధికంగా తరలివస్తున్న వాటిలో ఈ రంగానిది మూడో స్థానం. నానాటికీ పురోగమిస్తున్న ఈ మార్కెట్ ఎంతో మందికి సొంత ఇళ్లను, మరెంతో మందికి ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.
నాణానికి మరోవైపు..
ఒకవైపు ఇళ్ల కొరత వేధిస్తుండగా పట్టణాలు, గ్రామాల్లో కలిపి దేశంలో 1.10 కోట్ల ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రైవేటు ఇళ్లకు అధిక అద్దెలు, ప్రభుత్వం నిర్మించిన వాటిలో సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణం.
- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల