వర్షాలు, వరదల్లో.. అక్రమాల పరవళ్లు
వానలు, వరదల్లోనూ ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. వాగులు, ఉపనదుల్లో నీళ్లు ప్రవహిస్తున్నా వదిలిపెట్టట్లేదు. నీటి ప్రవాహంలోనూ ఇసుకను అడ్డంగా తోడేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం, మూసీ, మంజీర, దుందుబి నదులు
వాగుల్లో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలు
తెల్లవారుజామున, రాత్రి వేళల్లో నిరాటంకంగా దందా
వానలు, వరదల్లోనూ ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. వాగులు, ఉపనదుల్లో నీళ్లు ప్రవహిస్తున్నా వదిలిపెట్టట్లేదు. నీటి ప్రవాహంలోనూ ఇసుకను అడ్డంగా తోడేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం, మూసీ, మంజీర, దుందుబి నదులు, ఆకేరు వంటి వాగుల్లో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. నదుల్లోకి నీళ్లు రావడం, రోడ్లు దెబ్బతినడంతో అధికారిక ఇసుక అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇసుక కావల్సినవాళ్లు ఆన్లైన్ బుకింగ్ కోసం రోజులు, వారాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. అక్రమార్కులు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారు.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పలు చోట్ల ఇసుక అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. వాగుల్లో, వాటి సమీప భూముల్లో అక్రమార్కులు ఇసుకను తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. పగటి సమయంలో నిఘా ఉంటుందన్న కారణంతో చాలాచోట్ల రాత్రివేళ, కొన్ని చోట్ల తెల్లవారుజామున 3 నుంచి ఉదయం ఆరేడు గంటల వరకు తరలించేస్తున్నారు. నల్గొండ జిల్లా వంగమర్తిలో మూసీ నుంచి భారీగా ఇసుకను అక్రమంగా తీసుకెళుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఓ పోలీసు పహారా కాస్తున్న నేపథ్యంలో ఆరేడు గంటల నుంచి రాత్రి 10 వరకు, ఉదయం ఐదారు నుంచి 9 గంటల వరకు ఇసుకను ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్నారు.
* కాళేశ్వరం నుంచి వెళ్లే ఇసుక లారీల్లో బుకింగ్ కంటే అధికంగా ఇసుక నింపుతున్నారు.
* జూన్, జులై నెలల్లో ఓవర్లోడ్కు సంబంధించి ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 108 కేసులు నమోదయ్యాయి.
* కామారెడ్డి జిల్లా మద్నూరు, బిచ్కుంద మండలాల పరిధిలో మంజీర నదికి వర్షకాలంలో వచ్చే వరదలను ముందుచూపుతో గుర్తించి వేసవిలోనే ఇసుకను నది నుంచి తోడి డంప్ చేశారు. ఇప్పుడు లారీల్లో నింపి ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
* ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని తమ్మిలేరు వాగుకు వరద రావడంతో వాగులో ఇసుకమేటలు వేశాయి. అక్రమార్కులు రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇష్టానుసారంగా ఆ ఇసుకను కొల్లగొడుతున్నారు. వాగులో నుంచి రోడ్డుపైకి రావడానికి ప్రత్యేక మార్గం వేసుకున్నారు.
రూ.10 కోట్ల జరిమానాకు నోటీసులు
వర్ధన్న పేట మండలంలోని రెండు గ్రామాల్లో ఇసుకను అక్రమంగా విక్రయించడంపై మైనింగ్ శాఖ కొంతకాలం క్రితం స్పందించింది. 36 మందికి నోటీసులు జారీ చేసి రూ.10 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
* ఆసిఫాబాద్ జిల్లాలో రాస్పల్లి, గంగాపూర్ వాగుల్లో ఎర్ర ఇసుక నాణ్యమైంది కావడంతో డిమాండ్ బాగా ఉంది. రోజూ 20కి పైగా లారీల ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ఆసిఫాబాద్ పెదవాగు నుంచి నిత్యం 40-50 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలుతోంది.
* తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) రోజుకు 70-80వేల టన్నుల ఇసుకను విక్రయిస్తుంది. అయినా ఇళ్లు, ఇతర నిర్మాణాలకు అవసరమైన ఇసుక డిమాండ్కు ఈ సరఫరా సరిపోదు. జూన్ 10న 78,203.98 టన్నుల ఇసుకను విక్రయిస్తే- అదే ఆగస్టు 10న వానల నేపథ్యంలో అమ్మకాలు అతికష్టమ్మీద 1,411.60 టన్నులకు పరిమితం అయ్యాయి.
ఆకేరు వాగు ఖాళీ..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో ఆకేరు వాగు నుంచి నిత్యం వేల ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా వరంగల్కు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. తెల్లవారుజాము 3-6 గంటల మధ్య ఈ దందా పూర్తవుతోంది. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేల నుంచి రూ.6,500 వరకు విక్రయిస్తున్నారు. అక్రమార్కుల ధాటికి వాగులో ఇసుకంతా ఖాళీ అయ్యింది. దీంతో వాగుకు అనుకుని ఉన్న నద్ది భూములను రైతుల నుంచి ఇసుక వ్యాపారులు కొనుగోలు చేసి యంత్రాల సహాయంతో ఇసుకను తోడేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని నందనం, రాంనగర్, కక్కిరాలపల్లి, ఇల్లంద, గర్మిల్లపల్లి గ్రామాల్లో భూగర్భజలాలు తగ్గి ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి