రేపు ఎంసెట్‌ ఫలితాలు!

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫలితాలను ఈ నెల 12వ తేదీన వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. గురువారం సాయంత్రం జేఎన్‌టీయూహెచ్‌లో ఎంసెట్‌ కమిటీ సమావేశం

Published : 11 Aug 2022 04:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫలితాలను ఈ నెల 12వ తేదీన వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. గురువారం సాయంత్రం జేఎన్‌టీయూహెచ్‌లో ఎంసెట్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే ఫలితాల వెల్లడి తేదీని ఖరారు చేస్తారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1.56 లక్షలు, అగ్రికల్చర్‌కు 80 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సారి బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను కూడా ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ర్యాంకుల ఆధారంగానే కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం భర్తీ చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని