బాడీవేర్ కెమెరాలు ఎక్కడ?
ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న అపవాదు తొలగించుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘బాడీ వేర్ కెమెరాల’ ప్రయోగం మూణ్నాళ్ల ముచ్చటయింది. ఏడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీటిని ప్రవేశపెట్టగా..ఇప్పుడవి
మూణ్నాళ్ల ముచ్చటగా వినియోగం
సర్వర్ పనిచేయడం లేదనే నెపంతో మూలకు
ఈనాడు, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న అపవాదు తొలగించుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘బాడీ వేర్ కెమెరాల’ ప్రయోగం మూణ్నాళ్ల ముచ్చటయింది. ఏడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీటిని ప్రవేశపెట్టగా..ఇప్పుడవి చూద్దామన్నా కనిపించడంలేదు. మియాపూర్, కూకట్పల్లిలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో మళ్లీ ఇప్పుడా కెమెరాల అంశం తెరపైకి వచ్చింది. పోలీసుల వ్యవహారశైలిపై ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అసభ్య పదజాల ప్రయోగం, దురుసు ప్రవర్తన, విచక్షణ కోల్పోయి దాడిచేయడం వంటివి అందులో కొన్ని. పోలీస్శాఖపై ఉన్న ఈ అపప్రధను తొలగించుకునేందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత స్నేహపూర్వక (ఫ్రెండ్లీ) పోలీసింగ్ అనే విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్స్టేషన్లో రిసెప్షన్ కేంద్రాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి పోలీసుల ప్రవర్తన గురించి తెలుసుకోవడం వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కొంతవరకు సత్ఫలితాలనే ఇచ్చాయి.
ట్రాఫిక్ పోలీసులపై నిఘా కోసం..: రోడ్లపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘనల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని, వాహనదారులతో దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నుంచి బయటపడే లక్ష్యంతో అధికారులు ‘బాడీవేర్ కెమెరాల’ విధానాన్ని ప్రవేశపెట్టాలని అప్పట్లోనే నిర్ణయించారు. ఇందుకోసం 2015లో తొలుత హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వంద కెమెరాలు కొన్నారు. అటు తర్వాత ఉమ్మడి సైబరాబాద్ కమిషనరేట్లో మరో వంద కొనుగోలు చేశారు. ‘క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు మెడలో ఈ కెమెరాలను ధరిస్తారు. ఆ కెమెరాల పరిధిలో నమోదయ్యే దృశ్యాలు పోలీసు కంట్రోల్ రూంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సర్వర్లో నిక్షిప్తమవుతాయి. పోలీసుల ప్రవర్తనపై ఎవరైనా ఫిర్యాదుచేసిన పక్షంలో ఆ దృశ్యాల ఆధారంగా వాస్తవాలు తెలుసుకుంటాం’’ అని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రమంతా విస్తరిస్తామనీ చెప్పారు. ఇప్పుడు వాటి వాడకం దాదాపు నిలిచిపోయింది. సర్వర్ పనిచేయడం లేదని, కెమెరాలలో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయనే కారణంగా వాటిని వాడటం లేదని తెలుస్తోంది. తాజాగా మియాపూర్, కూకట్పల్లిలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఇప్పుడు ఈ కెమెరాల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ రెండు ఘటనల్లో వాహనదారుల ప్రవర్తన కారణంగానే తాము దురుసుగా వ్యవహరించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నప్పటికీ వాస్తవం ఏమిటన్నది వెల్లడికావడం లేదు. బాడీవేర్ కెమెరాలు వినియోగించి ఉంటే వాస్తవాలు తెలిసేవని, వీటిని మళ్లీ అందుబాటులోకి తేవాలని క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా