శత్రువు గుండెల్లో కవాతు
దేశంలోని 141 కోట్ల జనాభా నేడు నిశ్చింతగా నిద్రపోతోందంటే.. అది 14 లక్షలకు పైగా ఉన్న త్రివిధ బలగాల చలవే. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన రక్షణ రంగం గత ఏడున్నర దశాబ్దాల్లో అంచెలంచెలుగా వృద్ధి చెందింది.
మన సైనిక బలం అమేయం
రక్షణ రంగం పటిష్ఠం
దేశంలోని 141 కోట్ల జనాభా నేడు నిశ్చింతగా నిద్రపోతోందంటే.. అది 14 లక్షలకు పైగా ఉన్న త్రివిధ బలగాల చలవే. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన రక్షణ రంగం గత ఏడున్నర దశాబ్దాల్లో అంచెలంచెలుగా వృద్ధి చెందింది. స్వాతంత్య్రం దక్కిన నాడు దేశమంతా అనేక సంస్థానాలుగా ముక్కలు చెక్కలుగా మిగిలింది. విభజన గాయం ప్రజలనూ విడదీసింది. అంతటి విపత్కర పరిస్థితిలో దేశ ఐక్యతకు చిహ్నమై నిలిచింది మన సైన్యమే. అదే... సంస్థానాలను కలిపింది. కశ్మీర్ను కాపాడుకుంది. పాకిస్థాన్, చైనాలతో జరిగిన అయిదు యుద్ధాల్లో దేశాన్ని రక్షించింది.
2
చైనా తర్వాత అతిపెద్ద మిలిటరీ మనదే
3
రక్షణ రంగ కేటాయింపుల్లో భారత్ ర్యాంకు
4
సైనిక సామర్థ్యంలో అమెరికా, రష్యా, చైనాల తర్వాత దేశ స్థానం
సహనం, సాత్వికం, సమోన్నత సాంస్కృతిక నేపథ్యమున్న భారత్ది మొదటి నుంచీ కయ్యానికి కాలు దువ్వే స్వభావం కాదు. స్వాతంత్య్రం వచ్చాక మన పాలకులు సమర్థ విదేశాంగ విధానం, పరిపక్వత చెందిన దౌత్యమే దేశానికి బలమైన రక్షణ విధానమని నమ్మారు. పంచశీలను వంచించి, చైనా చేసిన దాడితో ఆ నమ్మకాలు వమ్మయ్యాయి. ఫలితంగా... సైనిక దళాలను దేశ దౌత్య లక్ష్యాలు, భౌగోళిక ఆకాంక్షలకు అనుగుణంగా మార్చడం మొదలైంది. నాటి నుంచి మన సైన్యం ఒక్కో అడుగేస్తూ అమేయశక్తిగా రూపుదిద్దుకుంది. స్వాతంత్య్ర అమృతోత్సవాలను నిర్వహించుకుంటున్న నేపథ్యంలో రక్షణ పరంగా ఇప్పటి వరకు సాధించిన విజయాలు, రానున్న 25 ఏళ్లలో చేరుకోవాల్సిన మైలురాళ్లపై ప్రత్యేక కథనం..
రాటుదేలిన రణసేన
దేశ రక్షణ, భద్రతా సవాళ్లను అధిగమిస్తూ మున్ముందుకు
ఆయుధాలను కొనుగోలు నుంచి అమ్మేస్థాయికి...
నవ్యపథంలో ఇండియన్ డిఫెన్స్
స్వతంత్ర భారత ప్రస్థానంలో త్రివిధ సాయుధ దళాల విజయాలు, త్యాగాలు చిరస్మరణీయం. పొరుగునున్న చైనా, పాకిస్థాన్లతో యుద్ధాలు తలెత్తినా మన సైన్యం అద్భుత పోరాట పటిమ కనబరిచింది. భద్రత విషయంలో ఇంటాబయటా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొంటోంది. గగన వీధుల్లో గర్జించే యుద్ధవిమానాలు, సముద్రజలాల్లో సత్తాచాటే యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూతలంపై శత్రు లక్ష్యాలను ఛేదించే యుద్ధ ట్యాంకులు, క్షిపణుల వంటి అత్యాధునిక ఆయుధాలతో అమ్ములపొదిని శక్తిమంతం చేసుకుంటోంది. రక్షణ రంగం బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా... ప్రత్యర్థుల కంటే మేటిగా, అగ్రరాజ్యాలకు దీటుగా ఆయుధాల తయారీకి సమకట్టింది. ఆత్మనిర్భరతను సాధించి, ప్రపంచంలోనే ధీరోదాత్త సేనగా నిలవడమే లక్ష్యంగా త్రివిధ దళాలు సమాయత్తమవుతున్నాయి. ఈ గమ్యాన్ని చేరుకునేందుకు రక్షణ రంగం వచ్చే పాతికేళ్లలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? తదుపరి ప్రస్థానం ఎలా సాగాలి..?
1950 కొరియా యుద్ధంలో భారత దళాలు వైద్యసాయం అందించాయి. ఐరాస ఇప్పటివరకూ నిర్వహించిన 71 శాంతి రక్షక కార్యకలాపాల్లో భారత్ 49 సార్లు సేవలు అందించింది. సుమారు 2 లక్షల మంది భారత సైనికులు పాల్గొన్నారు.
ఆదిలోనే పోరుబాట
స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళ్లలోనే భారత సైనిక ప్రయాణం యుద్ధాలతో ఆరంభమైంది. 1948లో ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ను, 1961లో ఆపరేషన్ విజయ్ పేరుతో పోర్చుగీస్ పాలనలోని గోవా, దీవు దమణ్లను అంతర్భాగాలుగా చేసుకోగలిగాం. జమ్మూకశ్మీర్, జునాగఢ్ సంస్థానాల విలీనానికీ సైన్యం అండగా నిలిచింది.
* 1947 అక్టోబరులో పాక్ సైన్యం అండతో కొన్నిశక్తులు జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. మహారాజా హరిసింగ్ అభ్యర్థన మేరకు రంగంలోకి దిగిన భారత సేనలు పాకిస్థాన్ సేనలను తిప్పికొట్టాయి. 1949లో కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా జమ్మూకశ్మీర్కు చెందిన మూడోవంతు భూభాగం పాక్ చేతుల్లో ఉండిపోయింది. దీన్నే పాక్ ఆక్రమిత కశ్మీర్గా పిలుస్తున్నాం. ఈ యుద్ధ పరిణామాలు నేటికీ రెండుదేశాల భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
* సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా 1962లో యుద్ధానికి దిగింది. సరైన సన్నద్ధత కొరవడటంతో భారత్ వైఫల్యం చవిచూడాల్సి వచ్చింది. డ్రాగన్ దండయాత్ర మనకు అనేక పాఠాలు నేర్పింది. దీంతో లాల్బహదూర్ శాస్త్రి... సోవియట్ యూనియన్ సహకారంతో రక్షణ రంగం ఆధునికీకరణకు బాటలు వేశారు.
* 1965లో ఆధునిక ఆయుధాలతో దురాక్రమణకు దిగిన పాకిస్థాన్ను భారత సైన్యం చావుదెబ్బ తీసింది. తొలిసారి మన వాయుసేన రంగంలోకి దిగి పాక్ స్థావరాలను నేలకూల్చింది.
* తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) విమోచన నిమిత్తం భారత్-పాకిస్థాన్ల మధ్య 1971లో యుద్ధం చోటుచేసుకుంది. పాక్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
* 1999లో పాక్ సైనికులు గొర్రెల కాపరుల ముసుగులో కార్గిల్, లద్దాఖ్ పర్వత శిఖరాలను ఆక్రమించారు. భారత్ నుంచి సియాచిన్ను వేరుచేయాలన్న కుట్రను ఇండియా చిత్తుచేసింది.
* 2020లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన చైనా దళాలనూ భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది.
పాకిస్థాన్తో భారత్ నాలుగు యుద్ధాలు చేసింది. వాటిలో 1999 నాటి కార్గిల్ యుద్ధం... ప్రపంచంలోనే అత్యంత ఎత్తున జరిగిన సమరంగా చరిత్రకెక్కింది.
అంకుర పరిశ్రమల భాగస్వామ్యంతో దేశ రక్షణ, భద్రతను బలోపేతం చేసేందుకు... కేంద్ర ప్రభుత్వం ‘ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్లెన్స్’ కార్యక్రమం చేపట్టింది.
ఎన్నో ఆపరేషన్లు...
పాకిస్థాన్, మయన్మార్లలోని ఉగ్రవాదుల స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయి. స్వదేశంలో తీవ్రవాదులపై పోరాటం, ఖలిస్థాన్వాదులపై ఆపరేషన్ బ్లూస్టార్, సియాచిన్లో పాక్ పీచమణచడం, శ్రీలంకలో భారత శాంతిసేన కార్యకలాపాలు, యెమెన్ నుంచి భారతీయుల తరలింపు వంటి క్లిష్టమైన సవాళ్లను మన బలగాలు సమర్థంగా చేపట్టాయి.
* ఆత్మనిర్భర్ భారత్ సాకారానికి కేంద్రం ‘అగ్నిపథ్’ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద సాయుధ బలగాల్లో నాలుగేళ్లపాటు సేవలు అందించేందుకు యువతను నియమిస్తుంది.
* చైనా, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 3,595 కి.మీ. రహదారులను రూ.20,767 కోట్లతో భారత్ నిర్మిస్తోంది.
* అమెరికా యుద్ధనౌక యూఎస్ఎన్ఎస్ ఛార్లెస్ డ్రూ... మరమ్మతుల కోసం ఇటీవల చెన్నై చేరుకుంది. అగ్రరాజ్య నేవీ షిప్ మన దేశంలో మరమ్మతులు చేయించుకోవడం ఇదే మొదటిసారి.
‘భారత్లో తయారీ’తో ఊపు...
‘మన ఆయుధాలను మనమే తయారు చేసుకుందాం. వాటిని మరొకరికి అమ్మే స్థాయికి ఎదుగుదాం’ అనే నినాదంతో భారత్ కొత్త అడుగులు వేస్తోంది. శత్రుదేశాల కంటే దీటుగా, అగ్రదేశాలకు పోటీగా నవతరం ఆయుధాల తయారీలో ముందడుగు వేస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తదితర సంస్థలు ఈ క్రతువులో నిమగ్నమయ్యాయి.
* రష్యా నుంచి కొనుగోలుచేసిన టి-53, టి-72, టి-90 యుద్ధట్యాంకులు ఉండగా... ‘కర్ణ’ పేరుతో అత్యాధునిక యుద్ధ ట్యాంకులు తయారీదశలో ఉన్నాయి.
* పైలట్ రహిత యుద్ధ విమానాలు నిషాంత్, లక్ష్య, రుస్తుంను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఐఎన్ఎస్ విశాఖపట్నం తదితర యుద్ధనౌకలు దేశరక్షణలో నిమగ్నమయ్యాయి.
* విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డ్ ‘ఐఎన్ఎస్ అరిహంత్’ జలాంతర్గామిని నిర్మించి... భారత్ను అణు జలాంతర్గాములున్న ఆరో దేశంగా నిలిపింది.
* సూపర్ సోనిక్ బ్రహ్మోస్-1 క్షిపణిని రష్యా సహకారంతో మన దేశం సిద్ధం చేసింది.
స్వదేశీ తేజస్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు పలుదేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ‘రక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహక విధానం-2020’ కింద 2025 నాటికి 25 బిలియన్ డాలర్ల (రూ.1,97,658 కోట్ల) ఉత్పత్తి సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్తగా సన్నద్ధం కావాలి
* చైనా, పాకిస్థాన్ల రూపంలో దేశానికి ముప్పు ఉన్నందున ఆయుధాల తయారీని మరింత ముమ్మరంగా చేపట్టాలి.
* విదేశాలకు భారీగా ఆయుధాలను ఎగుమతిచేసే దశకూ చేరుకోవాలి. తదుపరితరం అస్త్రశస్త్రాల రూపకల్పన విషయంలో అగ్రదేశాలతో పోటీపడాలి. ఆ తరహా ఆయుధాలకు భారత్ హబ్గా మారాలంటే, పరిశోధనలు ఊపందుకోవాలి. రక్షణ పరిజ్ఞానాల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు గణనీయంగా పెరగాలి.
* అస్త్రాల సమీకరణకు ప్రస్తుతం ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రక్రియను సరళీకరించి, వేగవంతం చేయాలి.
* త్రివిధ దళాలను ఏకతాటిపైకి తెచ్చే ‘థియేటరైజేషన్’ను వేగంగా పూర్తిచేయాలి.
* భావితరం ఆయుధాలైన మానవరహిత యుద్ధ వ్యవస్థలు, మూకదాడి చేసే స్వార్మ్ డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, స్మార్ట్ అస్త్రాలు, హ్యాకింగ్కు తావులేని కమ్యూనికేషన్ వ్యవస్థలను సముపార్జించాలి. సైబర్, అంతరిక్ష యుద్ధాలకు సిద్ధపడాలి. ఇందుకు కృత్రిమమేధ, క్వాంటమ్, హైపర్ సోనిక్, టెరాహెర్జ్, కాగ్నిటివ్, రోబోటిక్స్, స్మార్ట్ పదార్థాల వంటి అధునాతన పరిజ్ఞానాలపై పెట్టుబడులు పెంచాలి.
* త్రివిధ దళాల్లో కాలం తీరిన, ప్రస్తుత సాంకేతికలతో కూడిన, భవిష్యత్ తరానికి చెందిన ఆయుధాలు ఒక్కో వంతు చొప్పున ఉండేలా చర్యలు తీసుకోవాలి.
సాంకేతికంగా సన్నద్ధం కావాలి...
‘‘భవిష్యత్తు యుద్ధాలన్నీ అత్యున్నత సాంకేతిక యుద్ధభూమిలోనే జరుగుతాయి. ఇందుకు త్రివిధ దళాలు సైబర్ యుద్ధ నైపుణ్యాలను గణనీయంగా పెంచుకోవాలి. సంయుక్త ఆపరేషన్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు రంగంలో రక్షణ పరిశోధనలనూ ప్రోత్సహించాలి. దేశీయ సామర్థ్యంతో నౌకా దళాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని’’ భారత శతఘ్ని విభాగం మాజీ డైరెక్టర్ జనరల్.. లెఫ్టినెంట్ జనరల్ (విశ్రాంత) కేఆర్ రావు అన్నారు.
* ‘నెగెటివ్ లిస్ట్’ పేరున కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆయుధ వ్యవస్థలు, ఉపవ్యవస్థల దిగుమతిని నిషేధిస్తోంది. వాటిని పూర్తిస్థాయిలో దేశీయంగా, లేదంటే విదేశీ భాగస్వామ్యంతో తయారు చేసుకునే కసరత్తును త్వరితగతం చేయాలి.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?