డిజైన్ మారిందా?
డిజైన్లో చేసిన మార్పు వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం పంపుహౌస్ నీట మునిగిందా అన్నది నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పంపుహౌస్ మెయింటెనెన్స్ బే(నిర్వహణ ప్రాంతం)
అందుకే అన్నారం పంపుహౌస్ నీట మునిగిందా?
మొదట ఆమోదించిన ప్రకారం నిర్వహణ ప్రాంతం 132 మీటర్లు
తర్వాత 124 మీటర్లకు తగ్గింపు
ఈ రెండింటికీ అనుమతించింది జెన్కోనే
ఈనాడు హైదరాబాద్: డిజైన్లో చేసిన మార్పు వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం పంపుహౌస్ నీట మునిగిందా అన్నది నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పంపుహౌస్ మెయింటెనెన్స్ బే(నిర్వహణ ప్రాంతం) మొదట ఆమోదించిన డిజైన్ ప్రకారం 132 మీటర్లు. అంటే అంతవరకు కాంక్రీటు పని చేయాలి. తర్వాత మార్పు చేసి 124 మీటర్లకు తగ్గించారు. దీంతోపాటు మోటార్లు, స్విచ్గేర్లు ఇలా అన్నింటి మెయింటెనెన్స్ బేల మట్టాలు తగ్గిపోయాయి. మొదట ఆమోదించింది, తర్వాత మార్చి ఆమోదించింది కూడా జెన్కోనే. పంపుహౌస్ నిర్మాణం కావడంతో సివిల్ పనులతో సహా అన్నింటికి సంబంధించిన డిజైన్లను జెన్కోనే ఆమోదించిందని, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఆమోదానికి వెళ్లలేదని తెలిసింది. వారి పరిశీలనకు వెళ్లినా, అసలు కాంక్రీటు పనిని ఎనిమిది మీటర్లు ఎందుకు తగ్గించారన్న అంశాన్ని ప్రస్తుతం నీటిపారుదల శాఖ అధికారులు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
132 మీటర్లయితే పంపుహౌస్కు రక్షణ ఉండేదోమో...: అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్లకు నీటిని ఎత్తిపోసేందుకు చేపట్టిన పంపుహౌస్ సివిల్ పనుల డిజైన్కు మొదట 2016 నవంబరు 4న జెన్కో చీఫ్ ఇంజినీర్ ఆమోదం తెలిపారు. ఇందులో మెయింటెనెన్స్ బే 132 మీటర్లుగా ఉంది. దీనిపై కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ కూడా సంతకం చేశారు. దీనికి తగ్గట్లుగానే తవ్వకం చేపట్టినా, 2018 జూన్ 15న మళ్లీ మార్పు చేశారు. దాని ప్రకారం మెయింటెనెన్స్ బే 124 మీటర్లకు తగ్గిపోయింది. అంటే కాంక్రీటు పని అంత వరకు చేస్తే సరిపోతుంది. దీంతోపాటు పంపులు అమర్చే ఫ్లోర్, మొదటి స్విచ్గేర్ రూం, రెండో స్విచ్గేర్ రూం మట్టాలను కూడా మార్చారు. ఈ మార్పులకన్నా మెయింటెనెన్స్ బే మట్టాన్ని తగ్గించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సుందిళ్ల బ్యారేజికి 1.8 కిలోమీటర్ల దూరంలో అన్నారం పంపుహౌస్ ఉంది. సుందిళ్ల బ్యారేజి వద్ద అత్యధిక వరద మట్టం(హెచ్.ఎఫ్.ఎల్) 132.13 మీటర్లు కాగా, అన్నారం వద్ద 121 మీటర్లు. వీటిని పరిగణనలోకి తీసుకొనే రెండు బ్యారేజీల పూర్తి స్థాయి నీటిమట్టాలను నిర్ధారించారు. పంపుహౌస్కు సమీపంలో ఉన్న చందనాపూర్ వాగు హెచ్.ఎఫ్.ఎల్. 124.5 మీటర్లని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదట ఆమోదం తెలిపినట్లుగా 132 మీటర్ల వరకు కాంక్రీటు పని చేసి ఉంటే పంపుహౌస్కు రక్షణ ఉండేదోమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో అత్యధిక వరద వచ్చినపుడు సుందిళ్ల వద్ద నమోదైన మట్టం 130.6 మీటర్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంటే హెచ్.ఎఫ్.ఎల్. పూర్తిగా రాలేదు. వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్నదానిపై కూడా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం