సాగర్ ప్రాజెక్టులో తెరుచుకున్న అన్ని గేట్లు
నాగార్జునసాగర్ 26 గేట్లూ బార్లా తెరుచుకున్నాయి. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి తక్కువ సమయంలో అన్ని గేట్లు తెరిచింది అరుదేనని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. జలాశయం పూర్తి స్థాయి మట్టం 590 అడుగులకు గాను 589.50 అడుగులకు
కొనసాగనున్న నీటి విడుదల
హోరున పులిచింతలకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
ఈనాడు, హైదరాబాద్; నాగార్జునసాగర్, భద్రాచలం, చింతలపాలెం, న్యూస్టుడే: నాగార్జునసాగర్ 26 గేట్లూ బార్లా తెరుచుకున్నాయి. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి తక్కువ సమయంలో అన్ని గేట్లు తెరిచింది అరుదేనని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. జలాశయం పూర్తి స్థాయి మట్టం 590 అడుగులకు గాను 589.50 అడుగులకు చేరాక గేట్లు ఎత్తాలని కొద్ది రోజుల క్రితమే నిర్ణయించారు. ఈ స్థాయికి రావడానికి కొంత సమయం పడుతుందని అనుకోగా ఎగువ నుంచి ప్రవాహం పెరిగింది. బుధవారం అర్ధరాత్రికి 587 అడుగులను దాటింది. దీంతో గురువారం ఉదయం 5.30 గంటలకు 8 గేట్లను 5 అడుగుల చొప్పున ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అనంతరం గేట్ల సంఖ్యను పదికి పెంచారు. పది అడుగుల చొప్పున ఎత్తి 1.60 లక్షల క్యూసెక్కులు వదిలారు. మధ్యాహ్నం 12 గంటలకు 16.. మరో అరగంటలో 20 గేట్లకు పెంచారు. ఒంటిగంట సమాయానికి ప్రాజెక్టుకున్న 26 గేట్లనూ 10 అడుగుల చొప్పున ఎత్తారు. దీంతో సాగర్ స్పిల్వే నుంచి కృష్ణమ్మ దూకుతూ దిగువకు వెళ్తోంది.
585 వద్ద నీటి మట్టం కొనసాగింపు..
ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో సాగర్ గేట్లను మరికొద్ది రోజులు తెరిచి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం జలాశయ మట్టాన్ని 585 అడుగుల వద్ద కొనసాగించనున్నారు. శ్రీశైలం నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో గేట్లను ఇదేరీతిలో కొనసాగించే అవకాశాలున్నట్లు డ్యాం బాధ్యతలు చూస్తున్న డీఈఈ పరమేశం ‘ఈనాడు’కు వివరించారు. శ్రీశైలానికి 4.53 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 4.31లక్షలు దిగువకు వదులుతున్నారు.
గోదావరి వరదలతో రాకపోకలకు అడ్డంకి
భద్రాచలం గోదావరికి వరద తాకిడి ఆగడం లేదు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టం హెచ్చుతగ్గులకు గురవుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం నిదానంగా పెరుగుతూనే ఉంది. గురువారం ఉదయం 6గంటలకు 51.5 అడుగులుండగా సాయంత్రం 6 గంటలకు 52.4 అడుగులకు చేరింది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక అమల్లోకి వస్తుంది. కరకట్టపై రాకపోకలను నిషేధించారు. బ్యాక్ వాటర్తో వరదపోటు తలెత్తకుండా విస్తా కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక మోటార్లను ఏర్పాటు చేసి వరదనీటిని పైపుల గుండా తిరిగి గోదావరిలో కలుపుతున్నారు. భద్రాచలం-దుమ్ముగూడెం మధ్యలో తూరుబాక వద్ద ప్రధాన రహదారి నీట మునిగింది. ఈ మార్గంలో ఏపీ-తెలంగాణల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు- ఏలూరు జిల్లా కుక్కునూరు మండలాల మధ్య రవాణా స్తంభించింది. భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే దారిలో పలుచోట్ల రహదారులు మునిగాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా వైపు వెళ్లే వాహనాలను ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా ఆపారు.
ఉప్పొంగిన ప్రాణహిత.. ఆందోళనలో ప్రజలు
కౌటాల, న్యూస్టుడే: ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రలోని వార్ధ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు చంద్రాపూర్ జిల్లాలోని ఇరయి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటికి భారీ వర్షాలు తోడై ప్రాణహిత నది ఉప్పొంగుతోంది. దీంతో పరివాహకంలోని కుమురం భీం జిల్లాలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టివద్ద కనీవిని ఎరగని రీతిలో గురువారం రాత్రి ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుష్కరఘాట్ వద్ద ఆలయ ప్రాంగణంలో వరద నీరు చేరింది. ఇదే మండలంలోని తాటిపెల్లి వద్ద పెన్గంగ ఒడ్డుదాటి చేలలోకి చేరగా ముంపుగ్రామాల ప్రజలు ఆందోళనచెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!