22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవాల ముగింపు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఈ నెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఎంపీ కేశవరావు అధ్యక్షతన గల నిర్వహణ కమిటీ నిర్ణయించింది.
ముఖ్యఅతిథిగా హాజరు కానున్న సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఈ నెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఎంపీ కేశవరావు అధ్యక్షతన గల నిర్వహణ కమిటీ నిర్ణయించింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలను సమీకరిస్తామని, సినీ తారలు కూడా పాల్గొంటారని కేశవరావు వెల్లడించారు. ముగింపు వేడుకలపై గురువారం బీఆర్కే భవన్లో కమిటీ సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ విప్ ప్రభాకర్రావు, నగర మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్కుమార్, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు గౌరీశంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడారు. ‘‘ఈ నెల 22న వజ్రోత్సవాల ముగింపు సభలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ అధ్యక్షురాలు దీపికారెడ్డి బృందం ఆధ్వర్యంలో దీపాంజలి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ బృందం దేశభక్తి గీతాల సంగీత విభావరి, లేజర్ షో, బాణసంచా ప్రదర్శన ఉంటాయి. ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరుగుతుంది. ఆ సమయంలో అన్ని రహదారుల్లో ట్రాఫిక్ను నిలిపివేసి ఆలపించాలి. ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి. వాహనాల్లో ఉన్నవారు సైతం కిందికి దిగి జాతీయ గీతాన్ని గౌరవించాలి’’ అని కేశవరావు కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడం రన్
వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం పెద్దఎత్తున ఫ్రీడం రన్ నిర్వహించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో 5కే రన్ను హోంమంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. కేబీఆర్ పార్కు నుంచి ప్రారంభమైన పరుగులో మంత్రి తలసాని, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్ సోమేశ్కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
* రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు కేంద్ర రక్షణరంగ సంస్థ డీఆర్డీవో ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు కంచన్బాగ్లో ఫ్రీడం వాక్ నిర్వహించారు.
* బాన్సువాడలో ఫ్రీడం రన్కు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. అనంతరం స్థానిక థియేటర్లో ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి ఆయన వీక్షించారు. మంత్రుల్లో సబితారెడ్డి హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియం నుంచి ఎల్బీనగర్ కూడలి వరకు నిర్వహించిన పరుగులో పాల్గొన్నారు. శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో, నిరంజన్రెడ్డి వనపర్తిలో, ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో, గంగుల కమలాకర్ కరీంనగర్లో, ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరులో, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లో, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ హనుమకొండలో, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో ఫ్రీడం రన్లో పాల్గొన్నారు. కరీంనగర్, తొర్రూర్లలో భారీ జాతీయ పతాకాలతో నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
* యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నగర సంకీర్తన చేపట్టారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీతారాముల చిత్రపటంతో, జాతీయ జెండాలతో ఆలయ, గిరి ప్రదక్షిణ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే