బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించాలి

బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కోరారు. దిల్లీలో గురువారం ఆయన

Updated : 12 Aug 2022 07:03 IST

కేంద్ర మంత్రికి బీసీ సంఘం వినతి

ఈనాడు, దిలీ: బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కోరారు. దిల్లీలో గురువారం ఆయన కేంద్ర మంత్రిని కలిసి పలు సమస్యలు వివరించారు. ‘‘మండల్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 30 ఏళ్లుగా రిజర్వేషన్లు అమలవుతున్నా ఉపకార వేతనాలు ఇవ్వడం లేదు.స్వయం ఉపాధి పథకాల కోసం ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలి’’ అని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో గుజ్జ కృష్ణ, లాల్‌ కృష్ణ, మోక్షిత్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని