ప్రభుత్వానికి ఫీల్డ్‌ అసిస్టెంట్ల కృతజ్ఞతలు

తమను విధుల్లో చేరేందుకు ఆదేశించిన సీఎం కేసీఆర్‌కు ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కవితను కలిసి ధన్యవాదాలు

Published : 12 Aug 2022 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: తమను విధుల్లో చేరేందుకు ఆదేశించిన సీఎం కేసీఆర్‌కు ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కవితను కలిసి ధన్యవాదాలు తెలిజేశారు. సీఎం తాజా నిర్ణయంతో 7,000 మందికి పైగా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు లబ్ది చేకూరుతుందని ఎమ్మెల్సీ తెలిపారు. తెరాస కార్మిక విభాగం ఇన్‌ఛార్జి రూప్‌సింగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఎస్‌ ఫుడ్స్‌ ఛైర్మన్‌ మేడె రాజీవ్‌ సాగర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని