నీట్, జేఈఈ విలీనం!
విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి మొదలుపెట్టిన సీయూఈటీలోకే నీట్, జేఈఈ మెయిన్ను
సీయూఈటీ కూడా
మార్కులను బట్టి విభిన్న కోర్సుల్లో చేరే వెసులుబాటు
నూతన విధాన రూపకల్పనకు త్వరలో నిపుణుల కమిటీ ఏర్పాటు
వచ్చే ఏడాది నుంచి నూతన విధానం అమల్లోకి తేవాలనే యోచన
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్కుమార్
ఈనాడు, దిల్లీ: విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి మొదలుపెట్టిన సీయూఈటీలోకే నీట్, జేఈఈ మెయిన్ను విలీనం చేయాలని యోచిస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్కుమార్ చెప్పారు. ‘‘ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ ఎన్టీయే(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది. మూడు వేర్వేరు పరీక్షలను ఒకే పరీక్ష కిందికి తెస్తే ఎన్టీయే దాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి వీలవుతుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నాం’’ అని ఆయన తెలిపారు. ఈ అంశంపై సంబంధిత భాగస్వాములతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. తీసుకురాబోతున్న కొత్త విధానంపై ‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
పరీక్ష విధానంలో రానున్న మార్పులు ఏమిటి?
ప్రస్తుతం నీట్ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రాస్తారు. జేఈఈ విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాస్తారు. సీయూఈటీలోనూ ఈ సబ్జెక్టులతోపాటు 61 విభిన్న ఇతర సబ్జెక్టులు కూడా ఉంటాయి. ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా అన్నింటికీ కలిపి ఒకే సీయూఈటీ నిర్వహిస్తే విద్యార్థులకు వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నాం. ఇలా చేసినప్పుడు నీట్లో ప్రవేశాలు కల్పించే విద్యాసంస్థలు కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు తీసుకొని సీటు ఇస్తాయి.
* ఇంజినీరింగ్ విద్యా సంస్థలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాయి.
* ఇంజినీరింగ్, మెడిసిన్లలో సీట్లు దొరకని విద్యార్థులు ఇదే ప్రవేశపరీక్ష స్కోర్తో ఇతర సాధారణ యూనివర్సిటీల్లో తమకు నచ్చిన కోర్సుల్లో చేరొచ్చు.
విలీన విధాన ఆలోచన ఎలా వచ్చింది?
సీయూఈటీ(సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రవేశపెట్టిన తర్వాత దేశంలో నీట్, జేఈఈ మెయిన్తో కలిపి మూడు ప్రధాన పరీక్షలు నడుస్తున్నాయి. చాలా మంది ఈ మూడూ రాస్తారు. అప్పుడే ఒకే విద్యార్థి మూడు పరీక్షలు రాయాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచన వచ్చింది.
దీనివల్ల ప్రయోజనాలు ఏముంటాయి? ప్రవేశపరీక్ష ఒకటి కావడమేనా?
బహుళ పరీక్షల బాధ నుంచి విద్యార్థులకు విముక్తి లభిస్తుంది. అదే పెద్ద ప్రయోజనం. ఒక పరీక్షపై దృష్టిపెడితే సరిపోతుంది. అదికూడా 12వ తరగతిలో చదివిన అంశాలపై దృష్టిపెడితే చాలు. మల్టిపుల్ఛాయిస్ క్వశ్చన్స్లో నాలుగురకాల పరీక్ష ఉంటుంది. కొన్ని.. విద్యార్థుల జ్ఞాపకశక్తికి పరీక్షపెడతాయి. ఇంకొన్ని.. ఇచ్చిన జవాబుల్లో ఎంచుకున్న ప్రకారం వారి విశ్లేషణ శక్తిని పరీక్షిస్తాయి. మరికొన్ని సింపుల్కాన్సెప్ట్ ఆధారంగా ఉంటాయి. అలాగే ఒక పేరా ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలుంటాయి.
సాధారణ కేంద్ర విశ్వవిద్యాలయాల పరీక్షలతో పోలిస్తే నీట్, జేఈఈ చాలా కఠినంగా ఉంటాయి కదా? ఇప్పుడు వాటిని మిగతా వాటితో కలిపేస్తే వాటి నాణ్యతపై ప్రభావం చూపదా?
మన విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను వాళ్లు 12వ తరగతిలో ఏం చదివారన్నదాని ఆధారంగా పరీక్షించాలి. అంతే తప్ప హైస్టాండర్డ్స్ పేరుతో వారికి తెలియనివి, చదవనివి ప్రవేశపరీక్షల్లో ఇచ్చి, వాటిని అర్థం చేసుకొనేందుకు పిల్లలు కోచింగ్ సెంటర్లకు వెళ్లేలా చేయకూడదు. అలా ఉంటే అక్కడ కోచింగ్కు గిరాకీ పెరుగుతుంది. పిల్లలపై అనవసరమైన భారాన్ని మోపడం మంచిదికాదు. సీయూఈటీ ప్రశ్న పత్రంపట్ల విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్లస్టూలో వాళ్లు ఏం చదివారన్నదానిపై ఆధారపడి ప్రశ్నలుంటాయి. ప్రవేశపరీక్షలు అలాగే ఉండాలి.
ప్రవేశపరీక్షల విలీన అధ్యయన కమిటీ ఎప్పటిలోపు ఏర్పాటు చేస్తారు?
నెల, రెండు నెలల్లో కమిటీ ఏర్పాటుచేయొచ్చు. అది ఆరునెలల్లో సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రవేశపరీక్షలను అధ్యయనం చేస్తుంది. ఒకే ప్రవేశపరీక్ష ఎలా పెట్టవచ్చో సిఫార్సులు చేస్తుంది. ఆ సిఫార్సులను యూజీసీ, కేంద్ర విద్యాశాఖ, ఎన్టీయేలు కలిసి కూర్చొని చర్చించి పరీక్ష విధానాన్ని రూపొందిస్తాయి. అయితే అంతకుముందే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర భాగస్వాములను మానసికంగా సిద్ధంచేయడానికి ఇప్పటి నుంచే చర్చ మొదలుపెట్టాం. దానివల్ల లాభనష్టాలు తెలిసి వచ్చి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
ఇప్పుడు నీట్, జేఈఈ ర్యాంకులు ఇస్తున్నారు. సీయూఈటీలోనూ ర్యాంకులు ప్రకటిస్తారా?
ఆ విషయం కమిటీ నిర్ణయిస్తుంది. అయితే కొందరు మాత్రం మూడు వేర్వేరు పరీక్షలు రాసినప్పుడు మాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా? ఒకటే చేస్తే అవి తగ్గిపోవా అనే సందేహం వ్యక్తంచేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకునే భవిష్యత్తులో సీయూఈటీని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని భావిస్తున్నాం. మే, డిసెంబరులలో రెండుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి కాకపోయినా మరోసారి అవకాశం చేజిక్కించుకోవడానికి వీలవుతుంది.
కొంత ఆలస్యమైనా కొత్త విధానం రావడం తథ్యమా?
అవును. వీలైతే వచ్చే సంవత్సరమే దీన్ని అమల్లోకి తేవాలన్నది మా లక్ష్యం. ఒకవేళ చేయలేకపోతే 2024-25 సంవత్సరంలో తప్పకుండా తీసుకువస్తాం. ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోకూడదు. అన్నికోణాల్లో ఆలోచించి, భాగస్వాములందరి అభిప్రాయాలు స్వీకరించి ముందుకు వెళ్లాలన్నదే మా ఉద్దేశం. అందుకే దీనిపై మేం చర్చను కోరుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!