ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా మూడోసారి కంచర్ల రామకృష్ణారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా తెరాస అధ్యక్షుడు, మోత్కూరు మండలం దత్తప్పగూడేనికి చెందిన కంచర్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా వరుసగా మూడోసారి

Published : 13 Aug 2022 04:53 IST

మోత్కూరు, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా తెరాస అధ్యక్షుడు, మోత్కూరు మండలం దత్తప్పగూడేనికి చెందిన కంచర్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా వరుసగా మూడోసారి నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఆయనకు ఉత్తర్వులు అందజేశారు. రామకృష్ణారెడ్డి 2018, జులైలో మొదటిసారి ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ తరవాత 2020, జులైలో రెండోసారి ఆ సంస్థ ఛైర్మనుగా నియమితులైన రామకృష్ణారెడ్డి.. మరో రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగడానికి తాజాగా పొడిగింపు ఉత్తర్వులు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని