సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణను కలిసిన కృష్ణయ్య

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కలిశారు. జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఆహ్వానం మేరకు

Published : 13 Aug 2022 04:52 IST

అంబర్‌పేట, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కలిశారు. జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఆహ్వానం మేరకు గురువారం రాత్రి దిల్లీలోని ఆయన నివాసంలో కలిసినట్లు శుక్రవారం ఆర్‌.కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అనేక చరిత్రాత్మక తీర్పులు వెలువరించారని కృష్ణయ్య కొనియాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి వన్నె తెచ్చారన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు లాల్‌కృష్ణ, బీసీ నేత మోక్షిత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని