నేరపరిశోధనలో ప్రతిభకు పట్టం
నేరపరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏటా అందజేసే ‘యూనియన్ హోంమినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్’ పురస్కారాల జాబితాను కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాలను
అయిదుగురు పోలీసులకు కేంద్రహోంశాఖ పతకాలు
ఈనాడు, హైదరాబాద్: నేరపరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏటా అందజేసే ‘యూనియన్ హోంమినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్’ పురస్కారాల జాబితాను కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 2018 నుంచి ప్రకటిస్తున్న ఈ పురస్కారాలకు ఈసారి దేశవ్యాప్తంగా 151 మంది ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి నలుగురు డీఎస్పీలు పర్వతగిరి వెంకటరమణ(ట్రాన్స్కో విజిలెన్స్), రుద్రవరం గాండ్ల శివమారుతి (ఆసిఫ్నగర్-హైదరాబాద్), ఆశల గంగారాం(బాలానగర్-సైబరాబాద్), రఘు వెగ్గలం(జహీరాబాద్)తోపాటు ఇన్స్పెక్టర్ బూజూరు అంజిరెడ్డి(ఎల్బీనగర్-రాచకొండ)కి ఈ పురస్కారాలు లభించాయి.
సాంకేతిక, సంప్రదాయపరంగా ఆధారాల సేకరణ
రుద్రవరం గాండ్ల శివమారుతి(1995 బ్యాచ్) లంగర్హౌస్ ఠాణా పరిధిలో నమోదైన పొక్సో కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు. 2019లో అయిదేళ్ల పాపపై అత్యాచారం కేసులో సాంకేతిక, సంప్రదాయ పరంగా ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో పకడ్బందీ అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడికి జీవితకాల శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బాధితురాలికి రూ.7లక్షల పరిహారం అందేలా మారుతి కృషి చేశారు. శివమారుతి హైదరాబాద్ సీసీఎస్లో పనిచేసిన కాలంలో టెక్ టీం, సిట్, స్పెషల్టీం, వైట్ కాలర్టీమ్లలో ఉంటూ క్లిష్టమైన కేసుల్ని చేధించడంలో కీలకంగా వ్యవహరించారు. టాస్క్ఫోర్స్ విభాగంలోనూ సత్తా చాటారు.
పొక్సో కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష
రఘు వెగ్గలం(1995 బ్యాచ్) 2020లో ఆర్మూర్ డీఎస్పీగా ఉన్న సమయంలో ఆర్మూర్ ఠాణా పరిధిలో పొక్సో కేసు నమోదైంది. పటాన్చెరుకు చెందిన బాధితురాలి(16)పై వంశీకృష్ణ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొక్సో కేసు కావడంతో రఘు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును పర్యవేక్షించారు. కీలక ఆధారాలు సేకరించి కొద్దిరోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడికి న్యాయస్థానం 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
బాలికపై సెక్యూరిటీగార్డు అత్యాచారం కేసులో..
గంగారం(1995 బ్యాచ్) అబిడ్స్ ఇన్స్పెక్టర్గా ఉన్న సమయంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసు నమోదైంది. 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల సెక్యూరిటీగార్డు కమల్భాన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈకేసులో గంగారాం పకడ్బందీ ఆధారాలు సేకరించి అభియోగ పత్రం దాఖలు చేయడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధించారు.
హత్యకేసులో బెయిల్ రాకముందే అభియోగపత్రం
అంజిరెడ్డి మేడిపల్లి ఇన్స్పెక్టర్గా ఉన్న సమయంలో ఒడిశాకు చెందిన కూలీ జయరాం రౌత్(23) హత్య జరిగింది. ఒడిశాకే చెందిన ముకుంద(33) రాడ్తో కొట్టి ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. 2020 మేలో జరిగిన ఈ హత్య కేసులో అంజిరెడ్డి పకడ్బందీ ఆధారాలతో 90 రోజుల్లో బెయిల్ రాకముందే అభియోపగపత్రం దాఖలు చేశారు. 11 నెలల్లో వెలువడిన తీర్పులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించారు.
హోంగార్డు అత్యాచారం కేసులో అయిదున్నర నెలల్లోనే తీర్పు
పర్వతగిరి వెంకటరమణ(1991 బ్యాచ్) గోపాలపురం (హైదరాబాద్ కమిషనరేట్) ఏసీపీగా ఉన్న సమయం(2020)లో బాలికపై అత్యాచారం కేసును చేధించడంలో కీలకంగా వ్యవహరించారు. తుకారంగేట్ ఠాణా పరిధిలో అంగవైకల్యంతో ఉన్న 16ఏళ్ల బాలికపై హోంగార్డు బొట్ల మల్లికార్జున అత్యాచారానికి పాల్పడిన కేసులో రెండు నెలల ఆరు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. అలాగే డీఎన్ఏ నమూనా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలతో మరో రెండు అనుబంధ అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ కేసు తీర్పు అయిదున్నర నెలల్లోనే వెలువడింది. పకడ్బందీ సాక్ష్యాధారాల కారణంగా నిందితుడికి పొక్సో చట్టంకింద 30 ఏళ్ల కఠినకారాగార శిక్షతోపాటు రూ.40వేల జరిమానా.. ఎస్సీ/ఎస్టీ నిరోధక చట్టం కింద జీవితఖైదుతోపాటు రూ.5వేల జరిమానా విధించారు. మరోవైపు బాధితురాలికి రూ.7లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!