తగ్గిన వరి సాగు
ప్రస్తుత వానాకాలం సీజన్లో దేశవ్యాప్తంగా వరి పంట సాగు తగ్గింది. ఈ నెల ఆరంభానికి 5.71 కోట్ల ఎకరాల్లోనే వరి నాట్లు వేశారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. 87 లక్షల ఎకరాలు తక్కువ సాగైనట్లు కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా తెలిపింది. 222
దేశవ్యాప్తంగా గతేడాది ఇదే సీజన్తో పోలిస్తే 87 లక్షల ఎకరాలు తక్కువ
యూపీ సహా 4 రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావం
రాష్ట్రంలో నీరున్నా పుంజుకోని సాగు
రేషన్ పంపిణీకి వానాకాలంలో పండే బియ్యమే కీలకం
ఈనాడు - హైదరాబాద్
ప్రస్తుత వానాకాలం సీజన్లో దేశవ్యాప్తంగా వరి పంట సాగు తగ్గింది. ఈ నెల ఆరంభానికి 5.71 కోట్ల ఎకరాల్లోనే వరి నాట్లు వేశారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. 87 లక్షల ఎకరాలు తక్కువ సాగైనట్లు కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా తెలిపింది. 222 జిల్లాల్లో వర్షాలు లేకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. కీలకమైన ఉత్తర్ప్రదేశ్లో 75 జిల్లాలకు గానూ 62 జిల్లాల్లో, బిహార్లో 38కి 35, ఝార్ఖండ్లో 24కి 23, పశ్చిమ బెంగాల్లో 23కి 16, మధ్యప్రదేశ్లో 50కి 15 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. జులై దాటినా ఈ జిల్లాల్లో వర్షాలు పడకపోవడంతో వరి సాగుచేసే పరిస్థితులు లేవని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వినియోగం తక్కువ ఉండే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నాయి. బిహార్ ప్రభుత్వం రైతులకు కరవు సాయం అందించేందుకు యోచిస్తోంది.
తెలంగాణలో సాధారణంకన్నా చాలా ఎక్కువగా వర్షాలు పడి సాగునీరు పుష్కలంగా ఉన్నా వరి సాగు విస్తీర్ణం పెరగలేదు. గతేడాది ఇదే సమయానికి 32.82 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. ఈ సీజన్లో ఇప్పటివరకూ 23.91 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. 8.91 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. గతేడాది వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా.. ప్రస్తుతం వచ్చే నెలాఖరున సీజన్ ముగిసేనాటికి 42 లక్షల ఎకరాల్లో వరి సాగు కావచ్చని రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో గతేడాది రికార్డుస్థాయిలో వరి విస్తీర్ణం పెరిగినా.. ఈ సీజన్లో సాధారణ విస్తీర్ణం 42 లక్షల ఎకరాలే ఉంటుందని ఆరంభంలోనే వ్యవసాయశాఖ లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్రోత్సాహమూ తగ్గించింది. గతంలో రైతులకు విక్రయించే వరి విత్తనాలపై క్వింటాకు రూ.వెయ్యి వరకూ రాయితీ ఇచ్చేది. ఈ సీజన్లో ఆ రాయితీని నిలిపివేసింది. మార్కెట్లలో అధికంగా విక్రయించే సన్నబియ్యం తెలంగాణలో వానాకాలంలోనే అధికంగా పండుతుంది. రాష్ట్రంలో రైతులను ప్రోత్సహిస్తే ఈ సీజన్లో సన్నాల సాగు విస్తీర్ణం పెరగవచ్చని చెబుతున్నారు.
కీలకంగా మారిన బియ్యం నిల్వలు
రేషన్ బియ్యం కోసం ఎఫ్సీఐ ఏటా వానా కాలంలో పండే పంట నుంచే దాదాపు 5.89 కోట్ల టన్నులు సేకరిస్తోంది. ప్రస్తుతం దేశంలో 5.48 కోట్ల టన్నుల బియ్యం నిల్వలున్నాయి. ఈ ఏడాది (2022-23) దేశవ్యాప్తంగా వివిధ పథకాల కింద ప్రజలకు పంపిణీకి మాత్రమే ఇవి సరిపోతాయని అంచనా. గత మార్చి నుంచి ఎండల తీవ్రత కారణంగా గోధుమ పంట దెబ్బతినడంతో ప్రస్తుతం దేశంలో బియ్యం నిల్వలు కీలకంగా మారాయి.
ధరలపై ప్రభావం
‘‘చిల్లర మార్కెట్లలో బియ్యం విక్రయ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 2 నెలల క్రితంతో పోలిస్తే కిలో నాణ్యమైన సన్న బియ్యం ధర రూ.2 నుంచి 3 వరకూ పెరిగింది. ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. నవంబరు నుంచి మార్కెట్లలో రైతులు అమ్మకానికి తెచ్చే ఖరీఫ్ సన్న వడ్లకు సైతం మంచి ధర పలికే అవకాశాలున్నాయి’’ అని హైదరాబాద్కు చెందిన వ్యాపారి రాజేశ్, మార్కెట్ వర్గాలు ‘ఈనాడు’కు చెప్పాయి.
రాష్ట్రంలో ఇప్పటికీ అవకాశం..
‘‘ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటారో లేదో తెలియక తెలంగాణ రైతులు వరి సాగుకు పెద్దగా ఉత్సాహం చూపలేదు. దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో ఇంతవరకూ నాట్లు వేయని రైతులు నేరుగా విత్తే పద్ధతిలో సాగుచేసినా పంట చేతికొస్తుంది’’ అని ఓ వ్యవసాయాధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?