అంతటా ప్రచారం.. ఏదీ పథకం..!?
వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్ ఏర్పాటు పథకం రాష్ట్రంలో అమలుకావడం లేదు. పీఎం కుసుమ్ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. వ్యవసాయ బోర్లకు తప్పక మీటర్లు పెట్టాలనే కేంద్ర సర్కారు
వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్ ఏర్పాటెక్కడ
అది ఉంటే ప్రయోజనమని ఊరూరా కేంద్రం హోర్డింగులు
సౌరవిద్యుత్ పెట్టాలంటే బోర్లకు మీటర్లు తప్పనిసరి
అందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కారం
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్ ఏర్పాటు పథకం రాష్ట్రంలో అమలుకావడం లేదు. పీఎం కుసుమ్ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. వ్యవసాయ బోర్లకు తప్పక మీటర్లు పెట్టాలనే కేంద్ర సర్కారు నిబంధనే అనుమతి నిరాకరణకు మూలకారణమని తెలుస్తోంది. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. మరోవైపు ‘ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా ఏవం ఉత్థాన్ మహాభియాన్’(పీఎం కుసుమ్) కింద సౌరవిద్యుత్ ఏర్పాటుచేసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని గ్రామాల్లో ప్రచార హోర్డింగులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. వాటిపై ఎక్కడా రాష్ట్ర డిస్కం లేదా టీఎస్ రెడ్కో చిరునామా సమాచారం లేకపోవడం గమనార్హం. రాష్ట్రప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆసక్తి చూపనందున డిస్కం/రెడ్కో చిరునామా, సమాచారం ఈ హోర్డింగులపై రాయవద్దని, రాస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధికారులు హెచ్చరించారు. అందుకనే వాటిపై కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వశాఖ(ఎంఎన్ఆర్ఈ) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని రాశారు. ఒకవేళ.. ఆ వెబ్సైట్లో తెలిపినట్లు రైతులు దరఖాస్తు చేసుకున్నా వారి పొలాల వద్ద సౌరవిద్యుత్ కేంద్రాలు పెట్టడానికి, కరెంటు తీసుకోవడానికి డిస్కంలు సహకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వలేదు. సాధారణ కరెంటు లైన్ల నుంచే ఏటా 50వేలకు పైగా వ్యవసాయ బోర్లకు కనెక్షన్లు ఇస్తున్న డిస్కంలు వాటిలో ఒక్కదానికైనా సౌరవిద్యుత్ ఏర్పాటును ప్రోత్సహించడం లేదు. రైతులకు రోజంతా సాధారణ కరెంటునే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నందున సౌరవిద్యుత్ ఉత్పత్తిని సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకోవడానికి వారు ముందుకు రారని విద్యుత్సంస్థలు పీఎం కుసుమ్ అమలు జోలికి వెళ్లడం లేదు. కానీ, వ్యవసాయ బోర్లకు కాకుండా ప్రతీ గ్రామంలో వాటికి కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక్కో ఫీడర్కు గరిష్ఠంగా 2 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న సౌరవిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు (రాష్ట్రస్థాయిలో 500 మెగావాట్ల ఉత్పత్తికి) అవకాశముందని రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) అధ్యయనంలో గుర్తించింది. ఇలా రాష్ట్రస్థాయిలో 500 మెగావాట్ల ఉత్పత్తికి అనువుగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రెడ్కో తాజాగా ప్రతిపాదించింది. ఇందుకోసం సబ్స్టేషన్ల వారీగా వ్యవసాయ ఫీడర్లను గుర్తించాలని డిస్కంలను సైతం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఆ పని చేస్తామని డిస్కంలు స్పష్టీకరించాయి. కేంద్రం పథకం అమలుచేయమంటోంది...రాష్ట్ర ప్రభుత్వం దాని అమలుకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రచార హోర్డింగుల ఏర్పాటుకు పెట్టిన ఖర్చూ వృథా అయినట్లేనని విద్యుత్ అధికారులే అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.
యూనిట్ ధర అధికమనేనా...
ఎన్టీపీసీ నుంచి యూనిట్ సౌరవిద్యుత్ను రూ.2.45కే డిస్కంలు కొంటున్నాయి. కానీ పీఎం కుసుమ్ కింద రైతులు సొంత వ్యవసాయ బోర్లకు లేదా ట్రాన్స్ఫార్మర్ వారీగా ఫీడర్ల వద్ద సౌరవిద్యుత్ కేంద్రం పెట్టుకుంటే అక్కడ ఉత్పత్తి చేసే కరెంటుకు యూనిట్కు రూ.3.13 చొప్పున వారికి చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఒకవైపు ఎన్టీపీసీ, ఇతర సంస్థల నుంచి యూనిట్ కరెంటు రూ.2.50లోపే లభిస్తుంటే.. పీఎం కుసుమ్ పేరుతో రైతుల వద్ద నుంచి రూ.3.13కి కొనమంటే అది తమకు మరింత భారమని డిస్కంలు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్రం ఏదైనా పథకాన్ని నేరుగా అమలుచేయాలనుకుంటే ఎలా విఫలమవుతుందో చెప్పడానికి ‘పీఎం కుసుమ్’ ఉదాహరణ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ