ఇంటర్ ఉంటేనే అంగన్వాడీ పోస్టు
కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్, వర్కర్ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదోతరగతి అర్హతగా ఈ పార్ట్టైమ్ నియామకాలు చేపడుతుండగా, ఇకపై కనీసం ఇంటర్మీడియట్ అ
విద్యార్హతలు పెంచిన కేంద్ర ప్రభుత్వం
కౌమార బాలికలకు పోషకాహార పథకం ప్రకటన
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్, వర్కర్ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదోతరగతి అర్హతగా ఈ పార్ట్టైమ్ నియామకాలు చేపడుతుండగా, ఇకపై కనీసం ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించింది. ఈమేరకు ‘మిషన్ సాక్షం అంగన్వాడీ, పోషణ్ అభియాన్ 2.0’ విధివిధానాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏటా 40వేల చొప్పున అయిదేళ్లలో 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించనుంది. అలాగే అంగన్వాడీ నియామకాల్లో కనీస వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడంతో పాటు గరిష్ఠ వయసు 35 ఏళ్లుగా ఖరారు చేసింది. కొత్త విధివిధానాలతో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 5,111 టీచర్, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ పోస్టుల్లో పనిచేసే సిబ్బందిని గౌరవ వేతన వర్కర్లుగా స్పష్టంచేసింది. అంగన్వాడీ సర్వీసుల్లో చేరిన మహిళలకు పదవీ విరమణ వయసు ఖరారు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చని తెలిపింది. అయితే 65 ఏళ్ల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వీసులో ఉండకూడదని వెల్లడించింది.
50 శాతం పదోన్నతులతో భర్తీ..
కొత్తగా చేపట్టే నియామకాల్లో 50 శాతం అంగన్వాడీ టీచర్ పోస్టులను అయిదేళ్ల అనుభవం కలిగి, ఆయాలుగా పనిచేస్తున్న వారితో భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్ పోస్టుల్లో 50 శాతం పోస్టులను అయిదేళ్ల సర్వీసు ఉన్న అంగన్వాడీ టీచర్లతో భర్తీచేయాలి. ఈ పోస్టులకు నిర్ణయించిన విద్యార్హతలు, సర్వీసు నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలి. అంగన్వాడీ సూపర్వైజర్, టీచర్, ఆయా పోస్టుల భర్తీలో రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
బాలికలకు ఇంటికే రేషన్
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం, ఆరేళ్లలోపు చిన్నారులకు పోషకాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తోంది. కౌమార బాలికల్లో రక్త హీనత ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కౌమార బాలికలకు పోషకాహారం కోసం ప్రత్యేక పథకం లేదా అదనపు సహాయం కావాలని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ కేంద్రానికి గతంలో ప్రతిపాదనలు పంపించింది. కౌమార బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు 14-18 ఏళ్ల బాలికల కోసం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టింది. తొలుత ఎంపిక చేసిన జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేయనుంది. ఏడాదికి 300 రోజుల పాటు రోజుకి రూ.9.50 చొప్పున ఇంటికే రేషన్ పథకం కింద పౌష్ఠికాహారం అందించనుంది. అంటే ఏడాదికి ఒక్కో బాలికకు రూ.2850 ప్రయోజనం కలగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా