ఎగువన నీరు.. దిగువ కన్నీరు
వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరద తగ్గని విచిత్ర పరిస్థితి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో ఉంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు
50 వేల ఎకరాలను ముంచెత్తిన ప్రాణహిత, పెన్గంగ జలాలు
నష్టాలతో అల్లాడిపోతున్న అన్నదాతలు
కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో ‘మహా’ విపత్తు
ఈనాడు డిజిటల్, ఆసిఫాబాద్-న్యూస్టుడే, బెజ్జూర్, కోటపల్లి: వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరద తగ్గని విచిత్ర పరిస్థితి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో ఉంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటంతో ప్రాణహిత, పెన్గంగ నదులు నిండుగా ప్రవహిస్తూ.. పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ప్రాథమికంగా 50 వేల ఎకరాల్లో (కుమురం భీం జిల్లాలో 35 వేల ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 15 వేల ఎకరాలు) పంటలు మునకలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటికే జులైలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ‘మహా’ వరద పోటుకు కుదేలవుతున్నారు. పంటలతోపాటు బావులు, మోటార్లు, పైపులు ఇతర సామగ్రి వరదలో కొట్టుకుపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరుసగా మూడో ఏడాది ఇలా పంటలు మునిగిపోయాయని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా నష్టపరిహారం మాత్రం ఇవ్వడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా ఇరయి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన ప్రతిసారీ పెన్గంగ, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ ఏడాదిలో జులై నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు ఇరయి ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లోని వేల ఎకరాలు వరదకు మునిగిపోతున్నాయి. దీనికితోడు వంతెనలు మునిగి పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.
నిండా ముంచుతున్న జలాలు
కుమురం భీం జిల్లా సిర్పూర్(టి)లో పెన్గంగ, కౌటాల మండలంలో వార్ధా నదుల జలాలు సైతం అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. ఈ రెండు నదుల సంగమంతో తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత ప్రవాహం మరింత ఉద్ధృతమవుతోంది. బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికల్పేట్, దహెగాం మండలాలతో పాటు, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని ప్రాణహిత పరీవాహకంలో రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంట చేలు కూడా ప్రస్తుతం పూర్తిగా నీటిలోనే ఉన్నాయి.
జలదిగ్బంధంలో గ్రామాలు..
కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలోని తలాయి, పాపన్పేట్, తిక్కపల్లి, పాతసోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, భీమారం, సుశ్మీర్, నాగేపల్లి, బండలగూడ, టోంకిని, పారిగాం, పాతమొగవెల్లితో పాటు, మరో 13 గ్రామాలను ప్రాణహిత నది వరద చుట్టుముట్టింది. సమీప రహదారులపై వరద ప్రవహిస్తుండటంతో మూడు రోజులనుంచి రాకపోకలు స్తంభించిపోయాయి.
రెండోసారి వేసిన పంటా నీటిపాలు..
గత నెలలో కురిసిన వర్షాలకు పంట ప్రాణహిత ప్రవాహంలో కొట్టుకుపోయింది. మళ్లీ దున్ని అయిదు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాను. పక్షం రోజుల నుంచి చేలో నీళ్లే ఉంటున్నాయి. పత్తి పంట పూర్తిగా నీటమునిగి పనికిరాకుండాపోయింది. మళ్లీ విత్తనాలు వేసే పరిస్థితీ లేదు.
- కోరితే ఎర్రయ్య, పాపన్పేట్, బెజ్జూర్
రూ.1 లక్ష నష్టపోయా..
అయిదు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాను. జులైలో కురిసిన వర్షాలకు పంట నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. మళ్లీ విత్తనాలు తెచ్చి వేశాను. రెండుసార్లు కలిపి రూ.లక్ష పెట్టుబడి అయ్యింది. ఎప్పుడు లేనంతగా ఈసారి పెన్గంగ నీళ్లు మా గ్రామం వరకు వచ్చాయి.
- పిప్రే బాపురావు, టోంకిని, సిర్పూర్(టి)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది.